దెందులూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కి దిమ్మ తిరిగిపోయే విధంగా వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. నిత్యం వివాదాల్లో ఉంటూ పార్టీకి తలనొప్పిగా మారుతూ ఎన్నికలు వస్తున్న కొలది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రజల తిరగబడేలా వ్యవహరిస్తున్నారని..చింతమనేని ప్రభాకర్ వైఖరి వల్ల విపక్ష పార్టీలకు చెందిన నేతలు తెలుగు దేశం ప్రభుత్వంపై  తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చింతమనేని ని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Related image

మొన్న జర్నలిస్టులపై దారుణంగా బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ ఐన చింతమనేని వీడియో పై చాలా మంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీపై మరియు చంద్రబాబుపై విరుచుకుపడిన సంగతి మనకందరికీ తెలిసినదే. అయితే ఇది గడిచి రోజులు గడవక ముందే మరొక వ్యక్తి పై చింతమనేని అనుచరులు దారుణంగా దాడి చేశారు.

Related image

దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు చింతమనేనిపై కేసు కూడా నమోదైంది. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడంలేదని చింతమనేనిపై మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Related image

చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పుకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్‌ ఉంటుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీంతో మరొకసారి చింతమనేని ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: