విజయనగరం జిల్లా పార్వతీపురం లో అధినేత జగన్ చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలకు..చంద్రబాబు గట్టిగా ప్రతిస్పందించారు. అక్టోబర్ 25 వ తారీఖున విశాఖపట్టణం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్య యత్నం విషయంలో ఇప్పటి వరకు నోరు విప్పని జగన్ తాజాగా పార్వతీపురంలో తనపై జరిగిన హత్యాయత్నం కుట్ర మొత్తానికి చంద్రబాబు బాధ్యుడు అంటూ భారీ బహిరంగ సభలో చెలరేగిపోయారు జగన్.
దీంతో జగన్ చేసిన వ్యాఖ్యలకు చాలా ఘాటుగా ప్రతిస్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోడీతో కలిసి పవన్ కల్యాణ్, జగన్ డ్రామాలు ఆడుతున్నారని, వారికి కేసిఆర్ తోడయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి బిజెపి కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణల వల్లనే ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. సిబిఐపై తాను తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
అవసరమైన ప్రతిసారీ కేంద్రంలో టీడీపి కీలకమైన పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. ఇష్టానుసారంగా ఊళ్ల పేర్లు పేర్లు మార్చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై అవినీతి కేసులు ఉన్నందువల్ల ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడలేకపోతున్నారని మాట్లాడితే బిజెపి ఎక్కడ బొక్కలో పెడుతుందో జగన్ భయపడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు.