సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి కమ్యూనికేషన్ సంగతి మాటేమో కాని విపరీతాలు మాత్రం ఎన్నో జరుగుతున్నాయి.  సెల్పీమోజులు పడి ప్రాణాలు పొగొట్టుకుంటుంటే..డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ప్రాణాల మీకు తెచ్చుకోవడమో..ఇతరు ప్రాణాలు హరించడమో జరుగుతుంది.  తాజాగా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు నడిపిన ఓ డ్రైవర్, రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు.  ఈ ఘటన హైదరాబాద్ శివార్లో జరిగింది. 

వివరాల్లోకి వెళితే..ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు 'ఏపీ 29 జడ్‌ 2157' నంబర్ గల టీఎస్ ఆర్టీసీ బస్సు వస్తుండగా..డ్రైవర్ టీవీ రెడ్డి సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ బస్ డ్రైవ్ చేయగా అనుకోకుండా అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కించాడు..అటు పక్క నుంచి వెళ్తున్న కోటేశ్వరరావు దంపతుల బస్ వేగంగా తగలడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. 
A youngster died in a bus accident at Uppal
ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా, వారికి చికిత్సను అందిస్తున్నారు. ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజమండ్రికి చెందిన కోటేశ్వరరావు (29), స్వప్న (27) దంపతులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బస్సు డ్రైవర్ టీవీ రెడ్డి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: