తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ ఎన్నికలలో నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని నామినేషన్ వేయడం జరిగింది. అయితే సుహాసిని వేసిన నామినేషన్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..చిన్ననాటి నుండి ప్రజాసేవ చెయ్యాలని ఉంది అని ఇటీవల కామెంట్ చేసిన సుహాసిని వైఖరి పట్ల నందమూరి అభిమానులు మరియు టిడిపి కార్యకర్తలు లోలోపల ఆగ్రహం చెందుతున్నట్లు సమాచారం.

Image result for nandamuri suhasini

ఇంతకి విషయం ఏమిటంటే కుకట్ పల్లి నియోజకవర్గం నుండి వేసిన నామినేషన్ లో ఉన్న తప్పులు నందమూరి అభిమానులకు మరియు కుటుంబ సభ్యులకు కోపం తెప్పించి నట్లయింది. ఇంతకి అసలు మేటర్ ఏమిటంటే తన నామినేషన్ లో తాను నందమూరి హరి కృష్ణ తనయురాలు అని ఉండాల్సిన చోటులో అది కొట్టివేసి హరి కృష్ణ యొక్క భార్య గా రాసి నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది.

Image result for nandamuri suhasini

ఇది ఒక్కటే కాకుండా అచ్చు ఇలాగే మళ్ళీ ఓటర్ల జాబితాలో కూడా ఇలాగే ఉన్నట్టు తెలుస్తుంది.దీనితో నందమూరి అభిమానులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు.అసలు నామినేషన్ లోనే ఇన్ని తప్పులు ఉండటం ఏమిటి అని సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా నిలిచింది.

Image result for nandamuri suhasini

మరోపక్క ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు నామినేషన్నే వెయ్యలేని సుహాసిని..ప్రజా సమస్యల గురించి గానీ రాజకీయాల గురించి గాని ఏమి అవగాహన ఉంటుందని..ఇలాంటి వాళ్లను నిలబెట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడపాలని చూస్తుందని చాలామంది రాజకీయ నేతలు టీటీడీపిని విమర్శిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: