ప్రపంచంలో ఇప్పుడు ఉగ్రవాదం పెచ్చుమీరుతుంది. ఎక్కడ నుంచి దాడులకు పాల్పపడుతారో తెలియని పరిస్థితి నెలకొంది.  వీరిదాడుల్లో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.  ప్రస్తుతం దేశ రాజధానిలో హై అలర్ట్‌ ప్రకటించారు అధికారులు. ఇద్దరు ఉగ్రవాదులు న్యూఢిల్లీలోకి ప్రవేశించారని, వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని చెబుతూ ఇద్దరి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.

ఈ ఆనవాళ్లతో ఎవరైనా తారసపడితే, 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేసి చెప్పాలని పోలీసులు కోరారు.  ఇండియా-పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న ఫిరోజ్‌ పూర్‌ పరిసరాల్లో సంచరించినట్టు అనుమానాలు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Image result for delhi high alert
కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు. కాగా, గత వారంలో జైషే మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీ దిశగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: