ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సర్వేలు ఆ పార్టీలు చేసుకోవడం సహజం . అయితే ఈ సర్వే స్వయంగా టీడీపీ చేయించుకున్నది అయితే ఈ సర్వే లో ఖంగుతినే రిజల్ట్ వచ్చింది టీడీపీ కి . ఉత్తరాంధ్ర లో జగన్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాడన్నది ఈ సర్వే సారాంశం. కురుపాంలో జరిగిన పాదయాత్రకు  విజయనగరం జిల్లా ఏజేన్సీ ప్రాంతాల నుంచి లక్షల మంది గిరిజనులు రావడం ఆ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనంగా చెబుతున్నారు.


పాదయాత్రకు  ప్రజలు రావడం ఒకెత్తు అయితే చంద్రబాబు నాయుడిని జగన్ విమర్శిస్తున్న సమయంలో ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందన మరొక ఎత్తని అంటున్నారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో - ఏం చేయగలనో - ఏమి చేయలేనో జగన్ మోహన రెడ్డి స్పష్టంగా చెబుతుండడంతో  ప్రజల నుండి ఆదరణ పెరుగుతోంది. ఇంతకు ముందు విశాఖ జిల్లాలో పర్యాటించిన సమయంలో కూడా జగన్ కు ఇంత స్పందన వచ్చింది.


ఇక రెండు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పర్యాటించిన సమయంలో జిల్లా మొత్తం జగన్ వెనుక నడిచింది. ఆ సమయంలోనే జిల్లాలో జగన్ ప్రభావం ఎంతుందో రాజకీయ విశ్లేషకులకు ఓ అంచనా వచ్చింది. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో ఆదరణ తగ్గిపోయిందని - రాజకీయ విశ్లేషకులు ఓ అంచానాకు వచ్చారు. జగన్ పర్యాటన తర్వాత జిల్లాను కుదేపేసిన తితిలి తుఫాను ప్రభావం కూడా తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా పడింది.  తుఫాను ప్రభావంతో జిల్లా ప్రజలు అతలాకుతలం అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయ సహకారాలు అంతంత మాత్రమేనని ఓ అభిప్రాయం ఏర్పడింది. ప్రతిపక్షా పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు - నాయకులు - కార్యకర్తలు తుఫాను బాధితులకు చేసిన సేవ సిక్కోలు వాసులను మరింత జగన్ అభిమానులుగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం - విజయనగరం - శ్రీకాకుళం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పరమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచన వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: