వైసీపీ పార్టీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి మంచి రోజులు ఎన్నికల ముందు ముంచుకొస్తున్నాయి. కోడి కత్తితో హత్యాయత్నం చేయాలని రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నించిన జగన్ వాటికి బెదరకుండా యధావిధిగా తన పాదయాత్ర కొనసాగిస్తూ మరోపక్క తన రాజకీయ వ్యూహాలను అమలు పరుస్తూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరియు వివిధ రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఏంటో రుచి చూపిస్తున్నాడు.

Image result for rosaiah

40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి చుక్కలు చూపిస్తున్న జగన్ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మొత్తం చీలుస్తూ పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం యొక్క అవినీతి పనులను ఎండగడుతూ...ముందుకు దూసుకుపోతున్నారు.

Related image

దీంతో చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది తల పండిపోయిన నేతలు వైకాపాలో రావడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వైకాపాలో చేరడమో, లేకపోతే జగన్‌కి మద్దతుగా మాట్లాడడమో ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య రోశయ్య తరచుగా వైకాపా నేతలను కలుస్తున్నారు.

Image result for rosaiah

బొత్ససత్యనారాయణతో సహా చాలా మందితో మంతనాలు జరుపుతున్నారు. వైశ్య వర్గం మొత్తం జగన్‌కి అండగా ఉండేలా వ్యూహరచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఆయన జగన్  పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: