ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.  మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్నవారు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరిపోతున్నారు..ప్రత్యర్థి పార్టీలో అసంతృప్తి నేతలు అధికార పార్టీలో చేరిపోతున్నారు.  ఇలా ఏ క్షణంలో ఎవరు యూటర్న్ తీసుకుంటున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.  తాజాగా   చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ కి తిట్టినోళ్లంటేనే మహా ఇష్టమని, ఒకప్పుడు కేసీఆర్‌ను ఇష్టానుసారం తిట్టినోళ్లు ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తుండడం ఇందుకు నిదర్శనమని చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ విమర్శించారు.  కేసీఆర్ పాలనలో ప్రజలకు ఏం న్యాయం చేశారని..ఇచ్చిన హామీలు పూర్తిచేశారా.. ఉద్యమకారులను తీవ్రంగా అణచి వేశారన్నారు. 

తనకు సలాం అన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని..ఆయన కుటుంబ సభ్యుల కాళ్లు పట్టుకోనందునే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు.  రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తోందని, ఆయన కుటుంబ సభ్యులు దోచుకుతింటున్నారని ఆరోపించారు. చొప్పదండి నియోజక వర్గంలో మద్యం, డబ్బు ఏరులై పారుతోందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: