Image result for times now pre poll survey telangana
డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో గులాబి గుభాళింపు ఖాయమంటూ,  తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టనున్నారని లేటెస్ట్ టైమ్స్‌నౌ ప్రీ పోల్స్ సర్వే వెల్లడించింది. టీఆర్‌ఎస్ 70 సీట్లను గెలుచుకోనున్నట్టు టైమ్స్‌-నౌ- ప్రీ పోల్స్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 31 సీట్లను, టీడీపీ 2, ఎమ్‌ఐఎమ్ 8, బీజేపీ 3, ఇతరులు 5 సీట్లు గెలుచుకోనున్నట్లు సర్వే ప్రకటించింది.
Image result for times now pre poll survey telangana
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని 45.27 %  ప్రజలు కోరుకోగా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి 30.55 %,  కోదండరాం కు 3.37 %  ప్రజల మద్దతు లభించింది. ఇక టీఆర్‌ఎస్‌కు 37.55 %  ఓట్లు, కాంగ్రెస్‌కు 27.98 %, టీడీపీకి 5.66, ఎమ్‌ఐఎమ్‌కు 4.10 %, బీజేపీకి 11%, ఇతరులకు 13.71 % అని సర్వే వెల్లడించింది

.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖపాత్ర పోషించిందని 45.73 %  ప్రజలు తెలుపగా, కాంగ్రెస్ ప్రముఖపాత్ర పోషించిందని 32.90%, సర్వే వెల్లడించింది. తెలంగాణ వ్యతిరేకపార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేసిందని 52.44 % ప్రజలు తెలిపినట్లు సర్వే .
ఈ సర్వేను బట్టి రాహుల్ గాంధీ-చంద్రబాబు పొత్తును తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. 2014లో టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 34.30 కాగా.. ఈసారి 37.55 % రానున్నట్టు సర్వే తెలిపింది. అంటే 3.25 % ఓట్ల శాతం టీఆర్‌ఎస్‌కు పెరిగింది. టీడీపీకి 2014 లో 14.70 % ఓట్లు రాగా.. ఇప్పుడు 5.66 % ఓట్లే వస్తాయని,  అంటే టీడీపీ ఓట్ల శాతం 9.04 % తగ్గుతోంది. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు టీడీపీని ఎప్పుడో తిరస్కరించారని అర్థం అవుతోంది. .

మరింత సమాచారం తెలుసుకోండి: