ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబం తరపున ఆయన సుపుత్రుడు లోకేష్ నాయుడు చేసిన ఆస్తుల ప్రకటన, జాతీయ స్థాయిలో పెద్ద కామెడీగా మారింది. చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రతి ప్రతిసంవత్సరం పనిగట్తుకునే ఈ కామెడీ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎవ్వరూ నమ్మరు! నవ్వుల పాలవుతాం! అనే భయం, జంకు, అవమానం అనేది ఏమీ ఫీలవ్వకుండా చంద్రబాబు కుటుంబం ఈ కామెడీ డ్రామాను కొనసాగిస్తూ వస్తుంది.
ఇక ఈ ఆస్తుల ప్రకటన అనే ప్రహసనం దేశం మొత్తంలో తమ కుటుంబం మాత్రమే చేస్తుందని ఏ ఇతర రాజకీయ నాయకుడూ చేయడం లేదని చంద్రబాబు నాయుడు కుటుంబం గొప్పగా ప్రకటించుకుంటూ ఉంటుంది. ఇది అత్యంత హాస్యాస్పదం. కారణం భారత దేశంలో ప్రతి ప్రజాప్రతినిధి ఎన్నికల్లో పోటీచేసే ముందు తమ ఆస్తుల ప్రకటన చేస్తూ ఉంటాడు. ఇది చట్టం ప్రకారం సాంప్రదాయం. ఇందులో తప్పుడు ప్రకటన చేసిన వారెవరిపైనైనా ఎవరైనా పిర్యాదు చేస్తే ఎన్నికల కమీషన్ పరిశీలనలోకి తీసుకుంటుంది. అది నిజమని ఋజువైతే ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. చంద్రబాబు కుటుంబం చెసే ఈ ఆస్తుల ప్రకటనకు ఎలాంటి చట్టబద్దత లేదు.
తాము మాత్రమే దేశం మొత్తంలో ఇలా చేస్తున్నామని లోకేష్ చెప్పుకునేది, వింటూ జనం జోకులేసుకుంటారు. అదే నేడు జాతీయ మీడియా చేసింది. ఈ ఆస్తుల ప్రకటన ప్రహసనం విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చేవారు. తర్వాత చంద్రబాబు తనయుడు లోకేష్ ఈ బాధ్యతను ఇప్పుడు కొంతకాలంగా తలకెత్తు కొని అదో సాంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ విషయంలో తండ్రి చెసే కామెడీని వారసత్వంగా తనయుడు లోకేష్ కొనసాగిస్తూ ఉన్నాడు.
చంద్రబాబు కుటుంబంచేసే ఈ ఆస్తుల ప్రకటనలో కనిపించే ఆర్ధిక విలువలు లేదా నంబర్లు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. మీదు మిక్కిలి ఒక ఏడాది ప్రకటించే విలువలకు లెదా నంబర్ల కూ రానున్న ఏడాది చెప్పే వాటికి ఎలాంటి పొంతన గాని సామ్యంగాని ఉండదు. అసలు ఈ ఆస్తుల ప్రకటన చేసేది మార్కెట్ విలువ ప్రకారం కాదు అని, ఎప్పుడో వాటిని ఒనగూర్చుకొన్నప్పటి విలువల ప్రకారం ప్రకటిస్తారు అనేది కూడా జగమెరిగన జనమెరిగిన సత్యమే!
ఇక తాజాగా లోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన మాత్రం నేషనల్ లెవల్ కామెడీగా మారి, అది నేషనల్ మీడియాలో కూడా దేశ వ్యాప్తంగా హైలెట్ అవుతుంది. జాతీయ మీడియా బాగా హైలెట్ చేస్తున్న విషయం చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తుల కన్నా, ఆయన మనవడి పేరిట ఉన్న ఆస్తుల విలువ చాలా ఎక్కువ రెట్లు ఉండటం. ఈ విషయాన్ని నేషనల్ మీడియా హైలెట్ చేస్తోంది. చంద్రబాబు ఆస్తుల ప్రకటనను ఇలా కామెడీగా చూస్తోంది జాతీయ మీడియా. మొత్తానికి చంద్రబాబు ఆస్తుల ప్రకటన తెలుగువారికే కాదు జాతి యావత్తుకు కామెడీగానే మారిందన్న మాట!