అనంతపురం పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన కామెంట్ తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల రెండు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటించిన నేపధ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

Related image

ఈ సందర్భంగా ఎన్నికలు వస్తున్న తరుణంలో జిల్లాలో ఉన్న నేతలు ప్రజలతో మమేకం అవకుండా గ్రూపు రాజకీయాలు కడుతూ పార్టీ పరువుతీస్తున్నారని కుటుంబాల్లో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగాలనే తీసుకురావాలని చూస్తున్న నేతలపై దారుణంగా ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related image

అయితే ఇటీవల అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యుడు అయిన జేసీ దివాకర్ రెడ్డి తన స్థానంలో తన కుమారుని తీసుకురావాలని చూస్తున్నారు అన్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపద్యం లో బాబు మాటలు విన్న జేసీ దివాకర్ రెడ్డి..నీతులు, సూక్తులు తమకు మాత్రమే చెబుతున్నారని.. వాటిని చంద్రబాబు ఫాలో అవుతారా అంటూ వ్యంగాస్త్రం వేశారు.

Related image

తమ కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని జేసీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ ప్రయత్నానికి చంద్రబాబు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహించిన జేసీ దివాకర్ రెడ్డి ఈ విధంగా సెటైర్ వేయడంతో తెలుగుదేశం పార్టీలో చేసి చేసిన వ్యాఖ్యలు   హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: