అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. ఒకప్పుడు ఇక్కడ టీడీపీ నాయకులు తిరుగేలని నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన నాయకులు ఎక్కువ మందే ఉన్నారు. అయితే, ఇక్కడి పరిస్థితి మాత్రం ఆశించిన విధంగా మాత్రం లేకపోవడం ఎన్నికల ముంగిట చంద్రబాబును కలవరపెడుతోంది. భారీ సంఖ్యలో టికెట్లు ఆశిస్తున్న వారు కూడా ఇక్కడే ఉండడం గమనార్హం. దీంతో ఇప్పటికే సిట్టింగులుగా ఉన్న టీడీపీ నేతల మధ్య గత కొన్నాళ్లుగా టికెట్ల యుద్ధం ప్రత్యక్షంగానే కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరిపై ఒకరు సవాళ్లు రువ్వుకోవడం వంటివి కామన్గా మారిపోయాయి.
ప్రధానంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వివాదం, అదేవిధంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు నియోజకవర్గం రాయదుర్గంలో జేసీ అనుచరుడు వేలు పెడుతుండడం, అయిన దానికి కాని దానికీ. కూడా రోడ్డెక్కడం వంటి వి తరచుగా జరుగుతున్నా యి ఇటీవల ఓ స్వామికి సంబంధించిన వివాదంలో జేసీ చాలా పెద్ద ఎత్తున నోరు చేసుకున్నారు. పోలీసులను కొజ్జాలతో పోలుస్తూ.. వారిని తిట్టించడం, అనంతరం పోలీసులు కూడా నాలిక కోస్తాం అంటూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, దీనిపై జేసీ కంప్లెయింట్ ఇవ్వడం వంటివి స్థానిక రాజకీయాలను వేడెక్కించాయి. వచ్చే ఎన్నికల్లో జేసీ తనకు మారుడు పవన్ను రంగంలోకి దిపాలని ప్రయత్నిస్తున్నారు.
అనంతపురం ఎంపీ సహా తాడిపత్రి(ప్రస్తుతం జేసీ సోదరుడు, జేసీ ప్రభాకర్ ఉన్నారు),అనంతపురం అసెంబ్లీ సెగ్మెంట్ వంటివాటితోపాటు రాయదుర్గంపైనా జేసీ హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి టీడీపీ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు సాగుతున్నాయి. తాజాగా వీటిపై దృష్టి పెట్టిన చంద్రబాబు వాటికి ఫుల్ స్టాప్ పెడతారని అందరూ భావిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మారాల జలాశయానికి కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. కప్పలబండ గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు. అలాగే జిల్లాలో జరుగుతున్న ఆయా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపనున్నారు. ఆ తర్వాత జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య విభేదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించనున్నారని ముఖ్యంగా జేసీకి క్లాస్ తప్పదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.