తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తుంది.  గల్లీ గల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తూ నేతలు ఎంతో సందడి చేస్తున్నారు.  ఇక మైక్ సెట్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.  అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు.  తాజాగా అభ్యర్థుల ఎన్నికల వ్యయం, విరాళాల స్వీకరణపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల్లో నగదు రూపంలో ఖర్చు చేసినా, విరాళంగా స్వీకరించాలన్నా రోజుకి పది వేల రూపాయలకే అనుమతిచ్చింది. అంతకు మించితే అకౌంట్‌ బేస్‌గా జరగాలని ఆదేశించింది. 

తాము చేసే ఖర్చు చెక్‌, డీడీ, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలో లావాదేవీలు కొనసాగించాలని సూచించింది. గతంలో ఎన్నికల ఖర్చు కోసం రోజుకి రూ.20 వేల వరకు ఖర్చు చేయొచ్చని చెప్పిన ఎన్నికల సంఘం ఇప్పుడు మాత్రం గట్టి పట్టుమీదే ఉంది. గతంలో రోజువారీ నగదు పరిమితిని రూ.20 వేలుగా నిర్ణయిస్తూ 2011లో ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో తాజా మార్పులు చేసింది.

నేతలు విసృతంగా ధనం ఖర్చు చేస్తున్నారని..ఎన్నికల్లో మితిమీరుతున్న ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.  కాగా, దాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 40ఎ(3)కు 2017లో చేసిన సవరణల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: