ఎన్టీఆర్ ను ఇప్పడూ చంద్ర బాబు అడ్డంగా బుక్ చేశాడు . చివరి నిముషంలో సుహాసినిని తెర పైకి తీసుకొచ్చి  ఎన్టీఆర్ ను ఇట్టుకొనే టట్లు చేశాడు . అయితే  నందమూరి  కాంపౌండ్ కు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న టైమ్ లో ఓ ఇరకాటంలో పడ్డాడు ఎన్టీఆర్. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తన అక్క (హరికృష్ణ కూతురు) సుహాసిని బరిలో నిలవడంతో, ఆమె కోసం తప్పనిసరి పరిస్థితిలో ప్రచారం చేయాల్సి రావడం ఇప్పుడు ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారింది.


నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!

నందమూరి కాంపౌండ్ తో సంబంధాల్ని పక్కనపెడితే చంద్రబాబుతో ఎన్టీఆర్ కు పెద్దగా సత్సంబంధాలు లేవు. అప్పుడెప్పుడో 2009లో చేసిన ఎన్నికల ప్రచారం తర్వాత పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నాడు ఎన్టీఆర్. తను కోరుకున్న వ్యక్తులకు చంద్రబాబు టిక్కెట్లు నిరాకరించడం, తన ప్రాధాన్యాన్ని బాబు కావాలనే తగ్గించడంతో పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యాడు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు అక్క బరిలో దిగడంతో బాబు అంటే ఇష్టంలేకపోయినా ప్రచారం చేయక తప్పడంలేదు.


నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!

ఎన్టీఆర్ 2 రోజుల పాటు కూకట్ పల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తాడని తెలుస్తోంది. చంద్రబాబు అంటే ఇష్టంలేకపోయినా, కేవలం అక్క కోసం ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సుహాసినికి మద్దతుగా ఇప్పటికే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తారక్, ఇప్పుడు రోడ్ షోకు కూడా రెడీ అవుతున్నాడు. బాబుపై కోపంతో ఎన్టీఆర్ ప్రచారానికి దూరమైతే, మరోసారి ఆ కుటుంబానికి ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ వస్తుంది. రాకపోయినా బాబు ఆ గ్యాప్ ను సృష్టించగలరు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: