గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ నెరవేర్చలేదని గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు.  సోమవారం ఈసీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన అనుచరులపై సివిల్‌ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్ లో మహాకూటమి కార్యకర్తలు ఎవరూ ప్రచారం నిర్వహించవద్దని... ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో చూద్దామని అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రజా సమస్యలపై ఇరవై ఏళ్లుగా పోరాడుతున్న తనపై కేసీఆర్‌ సీఎం అయ్యాక తనపై 27 కేసులు పెట్టించారని ప్రతాప్‌ ఆవేదన వ్యక్తం చేశారు.   మంత్రి హరీష్‌ రావు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులంటిని బయటపెడతానని గజ్వేల్‌ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఫామ్ హౌస్‌లో ఉన్న వేలకోట్ల రూపాయలను పోలీసులు ఎందుకు సీజ్‌ చేయ్యట్లేదని ఆయన ప్రశ్నించారు.   పోలీసులు, ఎన్నికల అధికారులు తనన వేధిస్తున్నారని, వారి తీరులో మార్పు రాకుంటే గజ్వేల్‌ ఆర్వో కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకుంటానని వంటేరు హెచ్చరించారు. 

ప్రజలందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తూ హరీష్‌ రావు గల్లీ లీడర్‌ అయ్యాడని.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపించేందుకు ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. భ్రఘ్ట పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి తన ప్రాణమైన త్యాగం చేస్తానని ఆయన అన్నారు.  తనకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నాని, చనిపోతే బొంద పెట్టడానికి కూడా సొంత జాగా లేదని ఆయన ఆవేదన చెందారు. కేసీఆర్ ఫాంహౌస్ లో పోలీసులు ఎందుకు సోదాలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: