తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన కర్నూలుకు చెందిన బాల సాయిబాబా ఆకస్మికంగా మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారు. గత కొంత కాలంగా ఆయన అస్వస్థతో బాదపడుతున్నారు. హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ ఉదయం గుండెపోటుకు గురై మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
బాల సాయిబాబా ఎంత పేరు ప్రఖ్యాతులు గడించారో, అంతగానూ వివాదాస్పదుడయ్యారు. అయినప్పటికీ బాల సాయిబాబాకు కర్నూలు జిల్లాలోనూ, రాష్ట్రవ్యాప్తంగానూ అనేకమంది భక్తులున్నారు. ప్రతి ఏటా తన భక్తులతో కలసి ఆయన పెద్ద కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా తన భక్తులతో కలసి ఆయన పెద్ద కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు. ఆయన పేరిట కర్నూలు ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆయన మరణంపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.