లగటి పాటి సర్వేలకు ఆంధ్ర ప్రదేశ్ అలాగే తెలంగాణ లో మంచి గిరాకీ , నమ్మకం ఉందని చెప్పొచ్చు . అయితే లగటపాటి సర్వే ల గురించి వాటి క్రెడిబిలిటీ గురించి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసినాడు. అయితే అతను ఇంకా ఏమన్నాడంటే , చాలా మంది ఎక్కువ మంది అభిప్రాయం తీసుకుంటే సర్వే సరిగ్గా వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. సర్వే శాంపిల్ పెద్దదా చిన్నదా అన్నది ప్రధానం కాదు. మనం సర్వే కోసం ఎంచుకునే మనుషులు ఎవరన్నది అత్యంత కీకలం. ఒక ఐదు నియోజకవర్గాల్లో 50 మందిని అడిగి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితమేంటో చెప్పేయొచ్చు. ఆ 50 మందిని ఎన్నుకోవడంలోనే సర్వే సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

Image result for lagadapati raj gopal reddy

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం కానీ.. ఎవరు గెలుస్తారో మాత్రం చెప్పేయొచ్చు. నేరుగా వ్యక్తులతో మాట్లాడి చేసే సర్వేలకే క్రెడిబిలిటీ ఉంటుంది. సెల్ ఫోన్ లతో చేసే సర్వేలు సరైన ఫలితాలు రావు. ఇటీవలే మా టీం కర్ణాటకలో సెల్ ఫోన్ సర్వేతో పాటు ఫీల్డ్ సర్వే కూడా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణల్లో కూడా అలానే చేశాం. ఐతే రెంటి ఫలితాలూ భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఫోన్ సర్వే అనేది బోగస్ అని చెప్పొచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఓటర్లలో సైలెంట్ ఓటర్లు.. వోకల్ ఓటర్లు అని రెండు రకాలు ఉంటారు. సైలెంట్ ఓటర్ల నాడి పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ల వల్లే గత పర్యాయం తెలుగుదేశం గెలిచింది.

Image result for lagadapati raj gopal reddy

వోకల్ ఓటర్ల అభిప్రాయాల్ని బట్టి అందరూ గత ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనుకున్నారు. కానీ ఫలితాన్ని నిర్దేశించింది సైలెంట్ ఓటర్లు. వీరి మనోగతం మారుతూ ఉంటుంది. వాళ్లు న్యూస్ ఛానెళ్లు చూడరు. వారి నాడి పట్టుకోవడం కష్టం. వారి పల్స్ పట్టుకోవడం సర్వేకు కీలకం. ఎన్నికలకు 10-15 రోజుల ముందు చేసే సర్వేలు కచ్చితంగా ఉంటే పబ్లిక్ పల్స్ ఎలా ఉందనేది తెలుస్తుంది’’ అని లగడపాటి అన్నాడు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి డిసెంబర్ 5 లోపు సర్వే ఫలితాలు తన వద్ద రెడీగా ఉంటాయని.. పోలింగ్ అయ్యాక వాటిని బయటపెడతానని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: