దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.  ఆ మద్య కర్ణాటక ఎన్నికల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మద్య హోరా హోరీ యుద్దం కొనసాగింది. మొత్తానికి అక్కడ కాంగ్రెస్, జెడీయూ ఏకం కావడంతో సీఎం సీటు జేడీయూ నేత కుమారస్వామి దక్కించుకున్నారు.  ఇక రాజస్థాన్ ఉప ఎన్నికలు, కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆదిక్యాన్ని చాటుకుంది. తాజాగా  కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాసటగా నిలిచారు.

కర్తార్‌పూర్ కారిడార్‌కు బుధవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిద్ధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా   పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  మాట్లాడుతూ..తాము గతంలో క్రికెట్ ఆటగాళ్లమని..ఒకరంటే ఒకరికి అభిమానం ఉంటుందని..అయితే తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన సిద్ధును భారత్‌లో ఎందుకు విమర్శిస్తున్నారో తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. ఇరు దేశాల మధ్య గొడవలకు కారణమైన కశ్మీర్ సమస్యను సామరస్యంగా  పరిష్కరించుకుంటే గొడవలే ఉండవని అన్నారు. 

ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యాల కోసమే అతడు మాట్లాడాడని పేర్కొన్నారు. జర్మన్, ఫ్రాన్స్ దేశాల్లా మనం ఉండలేమా? అని ప్రశ్నించారు.  పాక్ లో సిద్దూకి మంచి ఫాలోయింగ్ ఉందని..ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసినా ఘన విజయం సాధిస్తారని నవ్వుతూ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: