ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తరుపు నుంచి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది సాదినేని యామిని. ఏ పార్టీ అధినేతనైనా తన మాటల చాతుర్యంతో అదరగొట్టేస్తుంది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సాదినేని యామిని కి సంబంధించి వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామినిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొంత కాలంగా సోషల్ మీడియాలో యామిని చురుకుగా పాల్గొంటున్నారు. ఆ మద్య ఓ టీవీ షోలో జనసేన నేత దిలీప్ సుంకర, యామినిల మధ్య దూషణలు హద్దులు దాటడంతో ఆమె కన్నీరు పెట్టుకుంటూ షో నుంచి వాకౌట్ చేశారు.అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా యామిని అప్పట్లో చెప్పారు.
తాజాగా సోషల్ మీడియాలో యామినిని దూషిస్తూ అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన నెల్లూరుకి చెందిన గంగినేని శ్రావణ్ కుమార్ ను గుంటూరు జిల్లా పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దేశంలో ‘మీ టూ’ ఉద్యమం భారీ ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా..పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ పోలీసులు తెలిపారు.