ఆంధ్రా రాజకీయాల్లో ఇప్పుడు మూడు ముక్కలాట సాగుతోంది. మొన్నటి వరకూ టీడీపీకు వంతపాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు గట్టిగానే సొంత గొంతు వినిపిస్తున్నాడు. టీడీపీ, వైసీపీలు రెండు బలంగానే ఉన్నా.. వాటితో దేనితోనూ కలవకుండా సొంతంగానే వచ్చే ఎన్నికల బరిలో దిగుతానంటున్నాడు. అంతే కాదు.. ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా తాను 2019లోనే కచ్చితంగా సీఎం అవుతానంటున్నాడు.

Related image

ఆమేరకు సీరియస్ గానే పర్యటనలు చేస్తున్నాడు జనసేనాని పవన్ కల్యాణ్. ఐతే.. పవన్ కల్యాణ్ ను తాను తప్పుకుండా సీఎం చేస్తానంటున్నాడో మత ప్రబోధకుడు. ఆయన ఎవరో కాదు.. కే.. పాల్.. ఈయన తెలియని వారు చాలా తక్కువే. గతంలో కేవలం క్రైస్తవ మత బోధకుడుగా ఉన్న పాల్.. వైఎస్ పుణ్యమా అని దాదాపు వీధినపడ్డాడు.

Image result for pawan kalyan speech

ఆ తర్వాత ప్రజాశాంతి అనే పార్టీను కూడా స్థాపించాడు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుచరులు సొంతం చేసుకున్న 99 ఛానల్ లో కేఏ పాల్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను టీవీలో పవన్ కల్యాణ్ ప్రసంగం చూసానని.. ఆయన ప్రసంగానికి ముగ్దుడినై ఆయన్ను సీఎం చేయాలని నిర్ణయించుకున్నట్టు కేఏ పాల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

Image result for ka paul 99tv interview

పవన్ కల్యాణ్ లో ఆవేశం, సేవాభావం ఉన్నాయని.. కానీ పవన్ దగ్గర డబ్బు లేదని కేఏ పాల్ అంటున్నారు. తాను ప్రపంచమంతా తిరిగి బిలియనీర్ల దగ్గర నుంచి నిధులు రాబట్టగలనని.. కాబట్టి తామిద్దరూ కలిస్తే.. బావుంటుందని కేఏ పాల్ అంటున్నారు. ఐతే.. ఇప్పటికే తన మూటల ద్వారా కే ఏ పాల్ ను జనం ఓ జోకర్ లా చూస్తున్నారు. ఈ మాటలు చూసి నవ్వుకోవడానికి పనికొస్తాయి తప్ప సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: