తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి ఏర్పాటైన దగ్గర నుంచి చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అవసరమైతే ఆయన్ను రాజకీయంగా అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చేశారు కేటీఆర్. కూకట్ పల్లిలో కాపుల సమావేశంలో కేటీఆర్ ఈ హాట్ కామెంట్స్ చేశారు.

Image result for ktr vs chandra babu

కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. మనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. కానీ.. చంద్రబాబు అనవసరంగా తెలంగాణలో వేలు పెడుతున్నాడు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన డబ్బు వెదజల్లుతున్నాడు. ఇక్కడి మీడియాను మేనేజ్ చేస్తున్నాడు. చీమ కూడా తన పుట్టలో వేలు పెడితే ఊరుకోదు. అలాంటింది మనం ఊరుకుంటామా.. ఊరుకునేది లేదు.

Image result for ktr vs chandra babu

చంద్రబాబు అంతు చూసేందుకు అవసరమైతే ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టేందుకు కూడా వెనుకాడం.. ఆయన శక్తిని ఆయన చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు ఎలా బుద్ది చెప్పాలో.. కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు... ఇలా సాగిపోయింది కేటీఆర్ రాజకీయ ప్రసంగం..

Related image

గతంలో ఓసారి ఇలాగే బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు తెలంగాణ రాజకీయాల‌్లో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ - టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. లేటెస్టుగా కేటీఆర్ కామెంట్లతో ఇది మరింత ముదిరే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తారని కూడా కేటీఆర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: