జేసి దివాకర్ రెడ్డి టీడీపీ లో విలక్షణ మైన గుణం కలిగిన నాయకుడు . అయితే ఒక పక్క జగన్ ను తిడుతూనే మరో పక్క పొగుడుతుంటాడు . అయితే ఈయన సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేయడానికి వెనుకాడని జేసీ, మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. ఎప్పుడు ఎవరిని పొగుడుతారు, ఎవర్ని తిడతారో ఎవరికీ అర్థం కాదు. ఈయన మీడియా ముందుకు వస్తే చాలు సంచల వ్యాఖ్యలకు కొదువే ఉండదు. సీఎం చంద్రబాబును మొదలుకుని ప్రధాని మోదీపై సైతం తనదైన శైలిలో జేసీ వ్యాఖ్యలు చేస్తుంటారు.

tdp mp jc diwakar reddy sensational comments on jagan

గతంలో జగన్‌పై అనేక సార్లు విమర్శలు చేసిన జేసీ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వడానికి జగన్ రూ.30 కోట్లు డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. ఓ వెబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ ఈ సంచలన విషయాలు వెల్లడించారు. నిజంగా మిమ్నల్ని జగన్ డబ్బు లివ్వమని అడిగారా అని విలేకరి ప్రశ్నించగా... తనను ఒక్కర్నే కాదు కానీ, తన అనుంగు మిత్రులను పంపి అడిగించారని జేసీ వ్యాఖ్యానించారు.  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తన ప్రధాన అనుచరుడైన ఓ కాంట్రాక్టరును పంపించిన జగన్, తనకు టికెట్ ఇచ్చేందుకు రూ. 30 కోట్ల ఇవ్వాలని కోరినట్టు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.

Image result for jc diwakar reddy

అయితే, తాను వారు అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించలేదని.. 2014 ఎన్నికలకు ముందు ఈ ఘటన జరిగినట్టు గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ‘నేనన్నాను... వాళ్ల తాత నాకు తెలుసు. వాళ్ల నాయిన నాకు తెలుసు. నేను పుట్టడంతోటే సిల్వర్ స్పూన్ తో పుట్టాను. వాళ్ల తాతకన్నా మా తాతలు చానా చానా భూస్వాములు, పెద్ద రెడ్లు. నా కంటే వీడు పెద్దోడా? నేను కప్పం కట్టడానికి. ఐయామ్ నాట్ రెడీ టూ పే ది కప్పం’ అని వ్యాఖ్యానించారు. కాగా, రెండు రోజుల కిందట వైసీపీకీ 25 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదాపై ఎవరు సంతకం పెడతారో వారికే తమ మద్దతు ఇస్తామని జగన్ చేసిన వ్యాఖ్యలపై జేసీ స్పందించారు. జగన్ 25 ఎంపీ స్థానాలు కోరుకోవడం తప్పు లేదన్న ఆయన.. ప్రజలు జగన్‌కు ఇవ్వాలి.. ఇస్తే సంతోషం. 25 స్థానాలు ఇవ్వకపోతే ఇంటికి పోతాడని జేసీ చలోక్తులు విసిరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: