ఇంకొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతలు ప్రచారపర్వంలో దూసుకెళ్ళిపోతున్నరు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మహా కూటమి నాయకులపై మరియు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుపై దారుణమైన కామెంట్లు చేశారు.

Image result for ktr

త్వరలోనే చంద్రబాబు అంతు చూస్తామని..కుదిరితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడతానని పేర్కొన్నారు కేటీఆర్. ఇప్పటికే అమరావతి దాకా తరిమికొట్టిన చంద్రబాబుకు..సరైన సమయంలో సీఎం కేసీఆర్‌ తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.

Related image

ఇటీవల భరత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మన నగరం కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ పుట్టలో వేలు పెడితే ఏ చీమైనా కుడుతుందని .. అలాంటిది తెలంగాణలో వేలు పెట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. ఇటీవల పేపర్‌ ప్రకటనలు చూస్తున్నాం.ఆప్రకటనలకు ఎవరు డబ్బు పెడుతున్నారో అందరికీ తెలుసు అంటూ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు.

Related image

ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రాహుల్ మరియు చంద్రబాబు చేస్తున్న కుయుక్తులకు మోసపోకూడదు అని..కెసిఆర్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలుసని..దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు ద్వారా ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే విధంగా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు కేటీఆర్.



మరింత సమాచారం తెలుసుకోండి: