ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి వైసీపీ నేత ప్రతిపక్ష నేత జగన్ పై షాకింగ్ కామెంట్ చేశారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ టికెట్ కావాలంటే 30 కోట్లు చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారని జెసి దివాకర్ రెడ్డి ఆరోపించారు.

Image result for jagan

వైసీపీ పార్టీలో సీనియర్ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ని తన ప్రధాన అనుచురుల్లో ఒకరైన కాంట్రాక్టర్‌ను జగన్మోహన్ రెడ్డి తన వద్దకు పంపించారని దివాకర్ రెడ్డి తెలిపారు.టికెట్ ఇవ్వాలంటూ రూ. 30 కోట్లు ఇవ్వాల్సిందిగా వారు తనను డిమాండ్ చేశారని కానీ తాను అందుకు అంగీకరించలేదన్నారు.

Related image

‘‘వాళ్ల తాత నాకు తెలుసు.. వాళ్ల నాయినా నాకు తెలుసు.. నేను పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాను.. వాళ్ల తాతకన్నా మా తాతలు చానా భూస్వాములు, పెద్ద రెడ్లు, నా కంటేప అతను పెద్దొడా..? నేను కప్పం కట్టడానికి..? అంటూ వ్యాఖ్యానించారు.

Image result for jagan jc

జెసి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. మరోపక్క వైసీపీ పార్టీ కి సంబంధించిన వ్యక్తులు జెసి చేస్తున్న కామెంట్లను ఖండిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనుగ్రహం కోసం జేసీ దివాకర్ రెడ్డి జగన్ ని తిడుతున్నారు అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: