చేవెళ్ళ నుంచి ఎంపీ గా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి రీసెంట్ గా తెరాస లోంచి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచీ తెరాస మీద , కెసిఆర్ యొక్క పద్దతుల మీదా విపరీతంగా సీరియస్ అవుతోన్న విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ని అర్ధరాత్రి అరస్ట్ చెయ్యడం మీద సీరియస్ అయ్యారు. అందరికీ అర్ధం అయ్యేలా తన మనసులోని మాటని చెబుతూ ఆయన ఒక రెండు నిమిషాల వీడియో కూడా విడుదల చేసారు.
ఆ వీడియో లో కెసిఆర్ తన యొక్క అధికారం అడ్డం పెట్టుకుని ఏ రకంగా పోలీసులని వాడుకుని ప్రత్యర్దులకి నరకం చూపిస్తున్నాడు అనేది క్షుణ్ణంగా చెప్పుకొచ్చారు . ఒకప్పుడు నిజాం పాలన లో జనం ఇబ్బందులు పడేవారు అనీ ఇప్పుడు అదే తీరు తో ఒక నియంత లాగా ప్రవర్తిస్తున్న కెసిఆర్ రేవంత్ మీద కక్ష కట్టడం దారుణమైన విషయం అని అన్నారు.
పోలీసులని అధికార పార్టీ ఈ రకంగా సొంతగా వాడుకోవడం ఏంటి అంటూ మండి పడ్డారు ఆయన. పోలీస్ వ్యవస్థ ని విచ్చిన్నం చేసే దిశగా కెసిఆర్ అడుగులు పడుతున్నాయి అనీ ఇది ప్రజా స్వామ్యానికి చాలా అపాయం అని చెప్పుకొచ్చారు.
పొలిటికల్ గా గెలవాలి తప్ప ఇలా ఎలక్షన్ కి ముందర అరస్ట్ చెయ్యడం వల్ల ప్రజాస్వామ్య పద్దతులని భంగ పరిచిన వాళ్ళం అవుతాం అని ఫైర్ అయ్యారు. కెసిఆర్ తన నియంత పరిపాలన లో మళ్ళీ జనాలని బలవంతంగా తోసే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తోంది అనీ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.