సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటానన్న కారణంతో అరెస్టయిన రేవంత్ రెడ్డి.. మంగళవారం సాయంత్రం విడుదలై ఇంటికి చేరుకున్నారు. అక్కడ తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన సమయంలో కేసీఆర్, కేటీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి అంటేనే కేసీఆర్ గుండెళ్లో వణుకుపుడుతోందని.. ఈ విషయం కోస్గి సభ ద్వారానే అర్థమైందని రేవంత్ అన్నారు. ఆ సభలో కనీసం తన పేరు ఎత్తేందుకు కూడా కేసీఆర్ కు ధైర్యం లేని కేసీఆర్ తనను ఓడిస్తాడా అని ఎగతాళి చేశారు.

Image result for REVANTH REDDY


కార్యకర్తలతో మాట్లాడిన రేవంత్.. ఇంకా ఏమన్నారంటే.. " కేటీఆర్ నాకు సవాల్ విసురుతుండు.. అరే కేటీఆర్ .. అమరవీరుల స్థూపం వద్ద ఏ విషయంపైనైనా చర్చకు నేను సిద్ధం. కొడంగల్ గురించైనా, కేసీఆర్ కుటుంబ చరిత్ర గురించైనా మరే విషయంపైనైనా చర్చకు తాను సిద్ధం.. ఎవడు మొగోడో.. ఎవడు మొనగాడో.. ఎవడు మడమ తిప్పని వాడో.. ఎవడు మాడాగాడో తెలుస్తుంది.

Image result for REVANTH REDDY


"ఎవడు మీసం మెలేస్తే రాష్ట్రం కదులుతుందో చూద్దాం.. అయినా మీసం మెలేయడానికి నీకు మీసం ఎక్కడ ఉంది.. పేడి మూతి బోడిలింగానివి.. నువ్వు ఆడవో.. మాడావో మాకు తెల్వదు.. మీసం ఉంటే ఇలా మెలేయాలి.. కేటీఆర్.. నీకు మీసాల్లేవు కదా.. నెల రోజులు టైమ్ ఇస్తా.. మీసాలు పెంచుకుని రావాలని సెటైర్లు వేశారు. కేటీఆర్ దుబాయ్ వెళ్లి నెత్తి మీద జుట్టు మొలిపించుకున్నారని.. అలాగే మీసాలు కూడా మొలిపించుకుని రావాలని కామెట్ చేశారు.

Image result for REVANTH REDDY VS KTR


సినిమా స్టూడియోల్లో మాట్లాడినట్టు కాదని.. బిడ్డా కేటీఆర్ నీ సంగతి తేలుస్తా అంటూ రంకెలు వేశారు రేవంత్ రెడ్డి. అక్రమాలకు పాల్పడే అధికారులపైనా రేవంత్ మండిపడ్డారు. ఇలాంటి అధికారుల ఆగడాలని కార్యకర్తలు డైరీలో రాసి పెట్టాలని.. ఈనెల 12న తాము అధికారంలోకి రాగానే వారి సంగతి చూద్దామని రేవంత్ అన్నారునాలుగు రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ మాజీలవుతారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: