తెలంగాణ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కూతురు భరిలోకి దిగటం తో అందరి కళ్ళు కూకట్ పల్లి నియోజక వర్గం వైపు చేరాయి . అయితే సుహాసిని ఇప్పడూ ఈసీ కు పిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రేపు(శుక్రవారం) పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార తెరాస, ప్రజాకూటమి హోరాహోరీగా ప్రచారం సాగించాయి. విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈసీ ఎన్నికలు సజావుగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసింది.