* తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. చిన్న చిన్న ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచే అనేక మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు పలుచోట్ల మొరాయించాయి. వాటిని అధికారులు పరిష్కరించారు.

* గవర్నర్ నరసింహన సహా పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేటీఆర్ హిమాయత్ నగర్లో ఓటేశారు. ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఓటేశారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీలో ఓటేశారు.

* ఆలేరు బరిలో దిగిన బీఎల్ ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నరసింహులుకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను ఆసుపత్రికి తరలించాయి. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

* కల్వకుర్తిలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ వారే తమపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ వారే దాడి చేశారని బీజేపీ వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.

* రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రక్తతల దృష్ఠ్యా పోలీసులను భారీగా మోహరించారు. గత రాత్రి కొస్గిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గా మధ్య గొడవ జరిగిన దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

* హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ దర్శకుడు రాజమౌళి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* హైదరాబాద్ లో ఓటేసేందుకు వెళ్లి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు చేదు అనుభవం ఎదురైంది. ఆన్ లైన్ లో ఆమెకు ఓటు ఉన్నట్టు చూపిస్తున్నా.. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేసరికి ఆమె ఓటు లేదు. ఓటేద్దామని వెళ్లిన ఆమె ఓటు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

* తెలంగాణ పౌరులంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పిలుపు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: