తెలుగు రాష్ట్రాల్లో మీడియా అనేది రాజకీయ పార్టీ ల వారిగా విడిపోయిందన్న సంగతీ అందరికీ తెలిసిందే. ఒక్కొక్క ఛానల్ ఒకొక్క పార్టీకి భజన చేస్తూ ఉంటుంది. అయితే  కేసిఆర్ అండ్ కేటీఆర్ ఆ మీడియాను నమ్మారు. ప్రకటనలు కోట్ల కొద్దీ కట్టబెట్టారు. మీడియా కూడా ఇక్కడ కేసిఆర్ ను అక్కడ చంద్రబాబుకు భజన చేసుకుంటూ, నొప్పించకుండా వార్తలు రాసుకుంటూ నాలుగేళ్లు కాలక్షేపం చేసేసింది.

Image result for ktr

కేసిఆర్-చంద్రబాబు కలిసిపోయి వుంటే ఈ మీడియా పని చాలా సులువు అయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక తప్పలేదు. ఎందుకంటే కేసిఆర్ కన్నా, చంద్రబాబు కన్నా, సామాజిక బంధాలు బలమైనవి కదా? అందుకే ఇప్పటి వరకు లోపల దాచిన ఒరిజినల్ ను బయటకు తీసాయి. ఇప్పుడు అంతా అయిపోయాక, చేతులు కాలిపోయాక, కేటీఆర్ నిన్నటికి నిన్న అన్నారు.. ఏమని..'ఆ రెండు పత్రికల యజమానులు కలిసి ఇదంతా చేసారు.. కూటమి ఫార్మ్ చేయించింది, ఈ వ్యవహారం అంతా వాళ్లదే' అని. వాళ్ల సంగతి 11 తరువాత చెపుతాం అని.

Image result for ktr

ఏంటీ చెప్పేది.. ఏమీ చేసేదిలేదు. కేసిఆర్ అధికారంలోకి వస్తే, మళ్లీ తమ చిట్కాలు అన్నీ వాడి దగ్గరయిపోతారు. లేదూ అంటే కేసిఆర్ అనే వాడిని మళ్లీ లేవకుండా చేస్తారు. వైఎస్ 'ఆ రెండు పత్రికలు' అంటూ గోలగోల పెట్టారు. ఏం జరిగింది? ఏం ఒరిగింది. అయితే కేసిఆర్ కొంచెం బెటర్. చాలావరకు స్వంత మీడియాను విస్తరింపచేస్తున్నారు. అది మరింత విస్తరిస్తేనే కాస్త ఫలితం వుంటుందేమో? లేదూ అంటే, మరి కొన్ని దశాబ్దాల పాటు ఈ అబద్దాల సామాజిక వంటకాల కార్యక్రమం ఇలా సాగుతూనే వుంటుంది. జనం అదే అమృతం అని సేవిస్తూనే వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: