తెలంగాణా ఎన్నిక అట్టహాసం గా ముగిసింది . ఇప్పుడు ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ సిద్ధం అయ్యాయి. తనదైన శైలి లో తెలంగాణా ఓటరు ఒక నిర్ణయం తీసుకుని ఓట్లు వేసి ఇంటికి వెళ్ళాడు. ఆ తరవాత జరిగేది ఏంటి అనేది అప్పుడే తెలీదు - 11 మధ్యాన్నానికి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడ్డం లేదు. ఇలాంటి తరుణం లో టీవీ చానల్స్ - సోషల్ మీడియా అన్నీ ఎగ్జిట్ పోల్స్ ని విశ్లేషించే పని లో పడ్డాయి.
మహా కూటమి vs తెరాస గా ప్రధాన యుద్ధం తెలంగాణా వ్యాప్తంగా సాగింది ఈ తరుణం లో ఓటరు తెరాస వైపే మొగ్గు చూపాడు అని అంటున్నాయి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా. టైమ్స్ నౌ రీసెంట్ గా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వైరల్ అవుతున్నాయి.
టైమ్స్ నౌ- సర్వే ప్రకారం..
తెలంగాణలో మొత్తం స్థానాలు 119 -
టీఆర్ఎస్- 66
ప్రజాకూటమి- 37
బీజేపీ- 7
ఇతరులు-9