కెసిఆర్ ముందస్తుకు వెళ్ళిన దగ్గర నుంచీ టెన్షన్ టెన్షన్ గా ఉండింది పరిస్థితి. తెలంగాణా లో ముందస్తు అనగానే దేశం మొత్తం ఒక్కసారి గా ఉలిక్కి పడింది . ఇప్పుడు తెలంగాణా వ్యాప్తంగా లగడపాటి రాజ్ గోపాల్ యొక్క సర్వే కీలకం గా మారింది . ఎలక్షన్ పూర్తి అవ్వగానే తన లెక్క పూర్తిగా చెప్పుకొచ్చారు లగడపాటి రాజ్ గోపాల్. తెలంగాణలో ఎన్నికలు పూర్తి అయిన వేళ ఎన్నికల సర్వేల ఫలితాలు నేతల్లోను, కార్యకర్తల్లోను ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒక్కొక్కరి సర్వేల ఫలితాలు ఒక్కో విధంగా ఉన్నాయి. మొన్నటి వరకూ లగడపాటి రాజగోపాల్ సర్వే తో రెండు సీట్ల వివరాలు ప్రకటించారు. దీంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. గతంలో లగడపాటి చేసిన సర్వేలు దాదాపు నిజం కావడంతో ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగబోతుందా అనే చర్చ మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా లగడపాటి ఫ్లాష్ సర్వే టిం సర్వే చేసింది.
లగడపాటి ఫ్లాష్ సర్వే కోసం హైదరాబాద్ కేంద్రంగా నాలుగు బృందాల జర్నలిస్టుల టింలు సర్వే చేశాయని తెలుస్తోంది.గతం లో కంటే ఎన్నికల పోలింగ్ ఎక్కువగా నమోదు ఐంది అని చెప్పిన లగడపాటి ఆ తరవాత ఫలితాలు విడుదల చేసారు. ప్రస్తుతం ఆ సర్వే నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సర్వే ప్రకారం గెలిచే వారి వివరాలు ఇలా ఉన్నాయి.
లగడపాటి సర్వే ప్రకారం..
తెలంగాణలో మొత్తం స్థానాలు 119 -
టీఆర్ఎస్ - 35
ప్రజాకూటమి - 65
BLF - 1
mim - 6
బీజేపీ - 7
ఇతరులు - 7