తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి ఎక్కువగా పోలింగ్ నమోదు అవుతుందని చాలా మంది అంచనా వేశారు. అయితే  ఉదయం నుంచీ పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగానే జనం కన్పిస్తున్నారు. కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో లోపాలు, కొన్ని చోట్ల కరెంటు లేక సమస్యలు, వీటికితోడు.. ఈవీఎంలను లైటింగ్‌ లేనిచోట ఏర్పాటు చేశారన్న ఆరోపణలతో.. ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.

Image result for telangana elections

ఇదిలావుంటే, దివ్యాంగుల కోసం, మహిళల కోసం ఈసారి కొన్నిచోట్ల ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్ల పట్ల ఓటర్లు హర్షం వ్యక్తంచేశారు. ప్రత్యేకంగా డెకరేట్‌ చేసిన పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్లకు ఆహ్లాకరమైన వాతావరణాన్ని అందిస్తుండడం ఈసారి ఎన్నికల ప్రత్యేకతగా చెప్పుకోవాలేమో. అయితే హైదరాబాదీలు ఈ సారి కూడా బద్దకించారు. సెలబ్రిటీలు తమ పనులు మానుకుని ప్లాన్ చేసుకుని మరీ ఓటు వేయడానికి వస్తుంటే... సామాన్య హైదరాబాదీలు మాత్రం చాలా బద్దకించారు. గత ఏడాది కంటే పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఓటింగ్ శాతం 35 మాత్రమే ఉండటంపై దర్శకుడు కొరటాల శివ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.


అర్బన్ ఓటర్... షేమ్ ఆన్ యు.. అంటూ కొరటాల శివ ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు రోజు ఓటు వేయండి అంటూ కొరటాల శివ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు అనేక మంది సెలబ్రిటీలు కూడా ఓటు వేయండి అని జనాలను కోరారు. చాలా రోజుల నుంచి ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసి సెలవు ఇప్పించినా అర్బన్ ఓటరు అస్సలు ఇంటి నుంచి కదల్లేదు. చాలామంది సెలవులకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నిజంగా కొరటాల శివ ఆగ్రహానికి అందరం మద్దతు పలకాల్సిందే... షేమ్ ఆన్ అర్బన్ ఓటర్ ! 

మరింత సమాచారం తెలుసుకోండి: