ఏ సర్వే చూసినా, ఏ ఎగ్జిట్-పోల్ వీక్షించినా, టీఆరెస్ విజయ ప్రభంజనం తెలిసిపోతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురు లేదని జాతీయ మీడియాల ఎగ్జిట్-పోల్స్ ఢంకా బజాయించి చెపుతున్నాయి. తెలంగాణ ప్రజలంతా అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకున్నారని తెలిపాయి.
*తెలంగాణాలో పోలింగ్ ముగిసిన తర్వాత ఇండియా టుడే ప్రకటించిన ఎగ్జిట్-పోల్స్ లో టీఆర్ఎస్ 79 నుంచి 91 సీట్లు పొంది ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించ నుందని తేల్చాయి. ప్రజాకూటమి 21 నుంచి 33 సీట్లు, ఎంఐఎంకు నాలుగు నుంచి ఏడు సీట్లు, బీజేపీకి ఒకటి నుంచి మూడు సీట్లు వస్తాయని ఎగ్జిట్-పోల్ లో తేలింది. ఇక పార్టీల వారీ గా ఓటింగ్ శాతాన్ని పరి శీలిస్తే, టీఆర్ఎస్ కు 46శాతం, కాంగ్రెస్ పార్టీకి 37శాతం, బీజేపీకి 7శాతం, ఎంఐఎంకు 3శాతం, ఇతరులకు 7శాతం ఓట్లు వస్తాయని ఇండియా-టుడే ఎగ్జిట్-పోల్స్ వెల్లడించాయి.
*అలాగే టైమ్స్ నౌ సి ఎన్ ఎక్స్ ఎగ్జిట్-పోల్ కూడా గులాబీదే విజయమని దానికి 66 సీట్లు, ప్రజాకూటమికి 37, కమలానికి 7, ఎంఐఎంకు7, ఇతరులకు 2సీట్లు వచ్చే అవకాశముందని తెలిపాయి.
*వీడీపీ అసోసియేట్స్ ఎగ్జిట్-పోల్స్ తెలంగాణలో గులాబీ పార్టీ అఖండ విజయం ఖాయమని టీఆర్ఎస్ కు 55 నుంచి 65 సీట్లు, ప్రజాకూటమికి 34 నుంచి 44 సీట్లు, బీజేపీకి 5 నుంచి 7 సీట్లు, ఎంఐఎంకు 7 నుంచి 8 సీట్లు, ఇతరులు 6 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశమున్నట్టు వీడీపీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
*రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణాలో టిఆర్ఎస్ 50 నుంచి 65 సీట్లు, ప్రజాకూటమికి 38 నుంచి 52 సీట్లు, బీజేపీ 4 నుంచి 7 సీట్లు, ఎంఐఎం 5 నుంచి 7 సీట్లు, 3 నుంచి 7 సీట్లు ఇతరులకు రావొచ్చని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్-పోల్స్ పేర్కొన్నాయి.
*న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ని పరిశీలిస్తే - టీఆర్ఎస్ 57 సీట్లు, ప్రజాకూటమికి 46, బీజేపీకి 6, ఇతరులకు 10 సీట్లు వస్తాయని తెలిపింది.
*ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు సూర్జిత్ భళ్లా తన సర్వేలో టీఆర్ఎస్ 70సీట్లు, ప్రజాకూటమికి 31, బీజేపీకి 8, ఇతరులు 10స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపారు.
*ఆరా సంస్థ సర్వేలో గులాబీ 75 నుంచి 85 సీట్లలో గుభాళించింది. ప్రజాకూటమికి 25 నుంచి 35 సీట్లు, బీజేపీకి 2 నుంచి 3 సీట్లు, ఇతరులకు 8 నుంచి 11 సీట్లు రానున్నాయని ఈ హైదరాబాద్ చెందిన ఆరా సర్వే అంచనా వేసింది.
*సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్ లెక్క ప్రకారం టీఆర్ఎస్ 84 నుంచి 89సీట్లు, ప్రజాకూటమికి 19నుంచి 21, ఎంఐఎంకు 7బీజేపీకి 2, ఇతరులకు 2స్థానాలు రావొచ్చని తెలిపాయి.
*ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ పార్టీ 62 నుంచి 70 సీట్లు, గెలుచుకుంటుందని వెల్లడించాయి. ప్రజాకూటమికి 32 నుంచి 38 సీట్లు, బీజేపీకి 6 నుంచి 8 సీట్లు, ఒక స్థానంలో ఇతరులు గెలిచే అవకాశమున్నట్టు అంచనా వేశాయి.
*మిషన్ చాణక్య సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 78 నుంచి 86, మహాకూటమికి 18 నుంచి 22, బీజేపీకి 2 నుంచి 6, మజ్లిస్ పార్టీకి 6 నుంచి 8, ఇతరులకు ఆరు సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది.
ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వె ప్రకారం ప్రజాకూటమి 65 (ప్లస్ ఒర్ మైనస్ 10), టీఆరెస్ 35(ప్లస్ ఒర్ మైనస్ 10) బిజెపి 7(ప్లస్ ఆర్ మైనస్ 2), ఎంఐఎం 6-7, ఇతరులు 7(ప్లస్ ఆర్ మైనస్ 2) వస్తాయని భిన్నమైన సర్వే ప్రకటించారు.
అయితే టీఆరెస్ కు కంటిలో నలుసులా ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వె ఉండగా, మిగిలిన 10 ఎగ్జిట్-పోల్స్ గులాబీయే పరిమళిస్తుందని తేలడంతో గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.
ఎవరు ఎన్ని 'ఎక్జిట్ పోల్ రిపోర్ట్స్' సిద్ధం చేసినా అసలు నిజం బాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది కదా! చివరి ఫలితాలు ఎలాగు 11వ తారీఖున తేలనుంది.