తెలంగాణాలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరికి విజయం ఎవరిని వరిస్తుందన్నది తేల్చడంలో ఎగ్జిట్ పోల్స్ అయోమయాన్నే మిగిల్చాయి. ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రజా కూటమి గెలుస్తుందని చెబితే మిగిలిన సర్వేలన్నీ కలిపి కేసీయార్ కి పట్టం కట్టాయి. అయితే ఇక్కడ లగడపాటి మాత్రమే మొత్తం అన్ని సర్వేలను వ్యతిరేకిస్తూ తన సర్వే చెబుతున్నారు. మరి చూడాలి.
తక్కువతోనైనా :
తెలంగాణాలో నిజానికి ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ నాయకత్వం సరిగా లేదు. బాబు కలిసాక మీడియా హంగు ఆర్భాటం కలసివచ్చాక మాత్రమే ఆ పార్టీకి హైప్ వచ్చింది. ఇక బడా నాయకులు అని చెబుతున్న వారు, . సీఎం రేసులో ఉన్న వారు కూడా తమ నియోజకవర్గాలకే పరిమితమైతే, ఒక్క కేసీయార్ 118 అసెంబ్లీ సీట్లలో ప్రచారం చేసి 87 సభల్లో ప్రసంగాలు చేశారు. ఇక మంత్రులు కేటీయార్, హరీష్ రావు కూడా అదే విధంగా ప్రచారం గట్టిగా చేశారు.
కూటమి నేతలు ఎవరూ కూడా ఇంత విగరస్ గా ఇన్నిచోట్ల తిరిగింది లేదు. అయితే వారి బలమున్న ప్రాంతాల్లో పరిస్థితులు బట్టి అధికారం లోకి రావచ్చు అనుకుంటున్నారు. కానీ జనం మాత్రం తమ వద్దకు వచ్చిన నేతకు ఓటు వేస్తారన్న లాజిక్ మరచారు. అందువల్ల కేసీయార్ సమ ఉజ్జీని కూటమి నేతలు చూపించలేకపోయారనే చెప్పాలి. తక్కువలో తక్కువ కేసీయారే మరో మారు అధికారంలోకి రావచ్చునని అంటున్నారు.
టీయారెస్కే అడ్వాంటేజ్ :
ఇక పోలింగ్ విషయం తీసుకుంటే అది టీయారెస్ కి కొంతవరకూ కలసివచ్చిందనే చెప్పాలి. రూరల్ ఏరియాల్లో, గులాబీ పార్టీకి పట్టున్న చోటా బాగా పోలింగ్ జరిగింది. అదే సెటిలర్లు బాగా ఉన్న చోట. హైదరాబాద్ లో తక్కువ జరిగింది. మరి ఈ పరిణామాలు తీసుకుంటే కూడా కేసీయార్ పార్టీకి కొంత సానుకూల అంశంగానే చూడాలి. టీయారెస్ ప్రచారం మూడు నెలల ముందు నుంచి సాగుతున్నదన్న సంగతి కూడా ఇక్కడ గమనంలోకి తీసుకున్నా అధికారం చేతిలో ఉండడం మరో అడ్వాంటేజ్ గా చూసుకున్నా, ప్రభుత్వం మీద దారుణంగా వ్యతిరేకత లేదన్న అంశం పరిశీలించినా కూడా కూడా ఫలితాలు కొంత టీయారెస్ కి సానుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.