తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. చంద్రబాబు తన పార్టీ ప్రతిష్ట ఫణంగా పెట్టారు. దశాబ్దాల జన్మ వైరాన్ని ఆ రెండు పార్టీలూ పక్కన పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చేవ లేక చచ్చుపడి పోయినా - తెలంగాణలో అది ఎంతో కొంత పదిలంగా ఉన్నా, కాంగ్రెస్ నేతలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుకు, టిడిపికి వ్యతిరేకంగా తమ కార్యకలాపాలు కొనసాగించి ఒకరి పతనం కోసం మరొకరు కృషి చేసిన చరిత్ర వారిది.
దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కంచు కోట బ్రద్దలు చేయటానికే పుట్టిన తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ కు విపరీతమైన కడుపుమంట. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు దేశం పార్టీతో చంద్రబాబుతో కూడా పోరాడిన నేపథ్యం ఉంది. ఇలాంటి తీరున్న వీరు ఇప్పుడు తెలంగాణాలో ప్రజాకూటమి అనే గొడుగు కిందకు టిడిపి, తన నూతన మిత్రుడు కాంగ్రెస్ తో కలిపి మరో రెండు టిజేఎస్, సిపీఐ పార్టీలను తెచ్చి ఒక కలగూర గంప ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్ధికి మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ రాష్ట్ర సారధి ఉత్తం కుమార్ రెడ్ది ప్రజాకూటమి అభ్యర్ధి సామా రంగారెడ్డికి (ఇబ్రాహిం పట్నం నియోజక వర్గంలో) మద్దతు నివ్వక పోవటం వారి మైత్రి బీటలువారటాన్ని సూచిస్తుంది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ఉత్తం కుమార్ రెడ్డికి టిడిపి చంద్రబాబు నాయుడికి విభేధాలు పొడచూపాయన్న వార్తలు వచ్చాయి.
ఆ కాలంలో కాంగ్రెస్, తెలుగు దేశం అంటూ విడిపోయి జనాలు మాత్రం ఒకరికి మరొకరు ద్రోహం చేసుకున్నారు. ఇరుపక్షాలు ఒకరినొకరు హత్యలు కూడా చేసుకున్నారు. ప్రజల మద్య రాజకీయ వైరాలను పెంచి పోషించిన రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వీరు ఇప్పుడు రాజకీయ అవకాశం కోసం కొద్దీ చేతులు కలిపారు. ప్రజాకూటమి బ్రాండ్ క్రింద ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు.
తెలంగాణ గత 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో కలసి పనిచేసిన వీరి కలయిక ఫలితాలు ఎలా ఉంటాయో 11వ తేదీన (మంగళవారం) తెలిసిపోతుంది. ప్రస్తుతానికి పరిస్థితిని చూస్తే, తెలంగాణలో ప్రజాకూటమికి అధికారం దక్కడం కలలో కూడా జరిగేలా లేదు. కేసీఆర్ టీఆరెస్ను వీళ్ళంతా కలిసి కట్టుగా కూడా ఓడించలేకపోతున్నారని పదికి పైగా సర్వే సంస్థలు తమ ఎక్జిట్-పోల్స్ ద్వారా స్పష్టం చేశాయి.
మరి
అదే జరిగితే, అంటే ప్రజా కూటమి
ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది అందరికి ఆసక్తిని
కలిగిస్తుంది. ప్రజాకూటమి గనుక ఓడితే కాంగ్రెస్
నేతలు చంద్ర బాబుపై విరుచుకుపడే అవకాశం మెండుగా ఉంది. చంద్రబాబుతో చేతులు కలపడం వల్లనే తెలంగాణలో ఓడామని వారు ధ్వజమెత్తే అవకాశాలున్నాయి.
ఇది చాలావరకు వరకూ నిజమే. ఒకవేళ
కాంగ్రెస్ గనుక చంద్రబాబుతో చేతులు
కలపక పోయుంటే, వాళ్లను విమర్శించడానికి కేసీఆర్ చేతిలో ఏలాంటి బ;లమైన ఆయుధమూ
ఉండేది కాదు.