ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు సొంతంగా ఇంటిలిజెన్స్ సర్వే చేయించారు. దీంతో ఇంటెలిజెంట్ సర్వే రిపోర్ట్ లో వచ్చిన ఫలితాలు చూసి ఖంగుతిన్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు. గత సంవత్సరం నవంబర్ నెలలో పులివెందుల నుండి మొదలు పెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాయలసీమ జిల్లాలలో ఘనంగా జరుపుకునే 2014 ఎన్నికలలో టిడిపి సత్తా చాటిన గుంటూరు పరిసర ప్రాంతాల్లో అడుగు పెట్టిన జగన్ కి ప్రజలు సీమ ప్రజలు ఏవిధంగా బ్రహ్మరథం పట్టారో అదేవిధంగా..బ్రహ్మరథం పట్టడం తో...సర్వేలో కూడా అదే తేలడంతో ఖంగుతిన్నారట చంద్రబాబు.
ఇదే క్రమంలో 2014 ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడానికి మెజారిటీ కారణాలలో ఒక కారణం 2 గోదావరి జిల్లాలు. అయితే ఈ క్రమంలో రెండో గోదావరి జిల్లాలలో కూడా జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టడం తెలుసుకొని మరింత చంద్రబాబు నిశ్చేష్టులయ్యారని సమాచారం.
అంతేకాకుండా ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్న జగన్ కి ప్రజలు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఇసుక వేస్తే రాలనంతగా వస్తున్న క్రమంలో ..అసలు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు లేకపోతే డబ్బులు ఇస్తే వస్తున్నారు అన్నదానిపై కూడా సర్వే చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని తెలుసుకుని షాక్ అయ్యారట చంద్రబాబు.
మొత్తం మీద తన సొంత ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్టులో తన ప్రభుత్వంపై ఎన్నడూ లేనంతగా ప్రజా వ్యతిరేకత ఉందని తేలడంతో...మరోపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో భయంతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.