తెలంగాణ ఎన్నికల ఫలితాల సరళిపై సర్వే ఎక్స్ పర్ట్ లగడపాటి రాజగోపాల్ సర్వే చేయించిన విషయం తెలిసిందే. ప్రజాకూటమి విజయం సాధించబోతోందని ఆయన చెప్పేశారు కూడా. అయితే వ్యక్తిగతంగా ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు అనే విషయాలపై కూడా లగడపాటి సర్వే చేయించారు. కానీ ఆ ఫలితాలను బయటపెట్టలేదు.

కానీ ఆయన గెలుపుబాటలో ఉన్న కొందరికి మాత్రం ఫోన్ చేసి.. వారు గెలవబోతున్నారని చెబుతున్నారు. అలా లగడపాటి నుంచి ఫోన్ అందుకున్న వారిలో జగిత్యాల నుంచి కాంగ్రెస్ తరపున బరిలో దిగిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఒకరు. లగడపాటి తనకు స్వయంగా ఫోన్ చేసి.. అన్నా నువ్వు గెలవబోతున్నావు.. అని చెప్పారట. దీంతో జీవన్ రెడ్డి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.



. జీవన్ రెడ్డి ప్రజాకూటమి క్యాబినెట్ లో మంత్రి కూడా అవుతారట. ఈ విషయం కూడా లగడపాటి రాజగోపాల్ చెప్పారట. దీంతో జీవన్ రెడ్డి, ఆయన అనుచరులు ఆనందంలో మునిగిపోయారు. ఇలా మరికొందరు నేతలు కూడా లగడపాటి తమకు ఫోన్ చేశాడని చెప్పుకుంటున్నారట.

Image result for jeevan reddy

మొత్తానికి తన సర్వే ద్వారా లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల ఎపిసోడ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందరి నోళ్లలోనూ నానుతున్నారు. ఒకవేళ లగడపాటి రాజగోపాల్ జోస్యం మరోసారి ఫలిస్తే ఇక ఆయన పరపతి అమాంతం పెరగడం ఖాయం. ఆయన సర్వేలకు మరింతగా డిమాండ్ పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: