పక్క పార్టీ మీద ఆరోపణ చెయ్యడం .. పక్క పార్టీ వాళ్ళ నుంచి ఫోన్ లు వచ్చాయి అని చెప్పడం లేటెస్ట్ ఫాషన్ గా మారిపోయింది తెలంగాణా రాజకీయాల్లో. నేషనల్ పోలిటిక్స్ లో కూడా ఎప్పుడూ చూడని తంతు నడుస్తోంది ఇప్పుడు తెలంగాణా లో. 12 గంటల్లో పోలింగ్ మొదలు అనగా తెలంగాణా వ్యాప్తంగా ఇప్పుడు మర్రి జనార్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలు షాకింగ్ గా ఉన్నాయి.

చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తమకి ఫోన్ లు చేస్తున్నారు అనీ జానా రెడ్డి సమక్షం లో రెబెల్స్ మరియూ ఇతర తెరాస ఎమ్మెల్యే లని తెరాస నుంచి కాంగ్రెస్ లోకి రమ్మని కోరుతున్నారు అని మీడియా సమక్షం గా ఆయన చెప్పిన మాటలు తెలంగాణా ప్రజానీకం చూసి ఆశ్చర్య పోతున్నారు. ఇంత పబ్లిక్ గా మీడియా అంతా ఈ రోజుల్లో పకడ్బందీ గా ఉన్న టైం లో ఒక తెలివిగల ఎంపీ అలా ఎందుకు ఫోన్ చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారు అందరూ.

తెరాస కావాలనే తమ మీద తమ నాయకుల మీదా ఈ రకమైన ఆరోపణలు చేస్తోంది అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మండి పడుతున్నారు. పొలిటికల్ గా రేపు తక్కువ సీట్లు వస్తాయి అని ఫిక్స్ అయిపోయిన తెరాస కావాలనే తమ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తోంది అని కాంగ్రెస్ మండిపడుతోంది.

తమ పార్టీ ని వదిలిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని ఎలాగైనా ప్రజల ముందు బద్నాం చెయ్యడానికి ఈ రకమైన నీచ రాజకీయాలకి తెరాస దిగబడింది అనీ రీసెంట్ గా ఇలాంటి ఫేక్ ఫోటోలనే కేటీఆర్ కూడా ట్విట్టర్ లో లగడపాటి కి వ్యతిరేకంగా పోస్ట్ చెయ్యడం గురించి ఉదాహరణ గా చూపిస్తూ చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: