ఈ మద్య భారత దేశంలో దాంపత్యంలో చిన్న చిన్న అనుమానాలు పెను భూతాలు అవుతున్నాయి.  భర్తపై భార్యకు అనుమానాలు..భార్యపై భర్తకు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆ గొడవ పెద్దది కావడంతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వస్తుంది. మరోవైపు అక్రమ సంబంధాలు కారణంగా కూడా భార్యాభర్తల మద్య విభేదాలు రావడం..చివరకు చంపుకునే పరిస్థితికి వస్తుంది.  మరికొంత మంది శాడిస్టు భర్తల వల్ల భార్యలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని..శారీరకంగా, మానసికంగా తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఎన్నో సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి. 

తాజాగా ఓ శాడిస్టు భర్త తన భార్య నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్త వైరల్ అయ్యాయి. అది కూడా ఆమెకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన యువతికి అదే ప్రాంతంలో నివసిస్తున్న యువకుడితో వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి సంసారం సజావుగా సాగింది.   ఈ మద్య అతనికి ఆస్ట్రేలియాలో జాబ్ రావడంతో కొంత కాలం జాబ్ చేసి భార్యను తీసుకు పోతానని హామీ ఇచ్చాడు. 

అయితే భర్త కోసం ఎదురు చూస్తున్న ఆ యువతికి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా నుంచి భార్యకు ఫోన్ చేసి ఫోన్ లోనే విడాకులు ఇచ్చాడు.  అంతే కాదు ఆమెతో ఏకాంతంగా గడిపిన కొన్ని ఫోటోలకు ఎడిట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి వేధించాడు. దీంతో విసిగిపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కాగా, యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: