ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాధారణంగా గంటసేపట్లోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. కానీ ఈసారి మాత్రం ఫలితాలు ఓ గంట ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈసారి ఈసీ కొత్త నిబంధనలు విధించింది.
కొత్త నిబంధనల ప్రకారం ముందుగా ఎలక్ట్రానిక్ పద్దతిలో వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలు తెరుస్తారు. ఒక్కో ఈవీఎంలో 1400 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఒక్క రౌండ్ కు 14 వేల ఓట్లు ఉంటాయి.
ఈవీఎం ఓట్లు లెక్కించిన తర్వాత ర్యాండమ్ గా వీవీ ప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈ రెండూ సరిపోలాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం.. ఒక్కో రౌండ్ తర్వాత పోలింగ్ ఏజంట్ల నుంచి అభ్యంతరం లేదని సంతకాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ వల్ల సాధారణంగా కంటే ఆలస్యంగా ఫలితాలు వెలువడతాయి.