భారత దేశంలో ఐదు రాష్ట్రాలు తెలంగాణ, మద్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్ లో ఎన్నికలు జరిగాయి. నేడు ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఎంతో ఉత్కంఠత నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలను బట్టే వచ్చే ప్రధాన మంత్రి ఎవరు అన్న విషయం తేలిపోతుంది. ఈ ఎన్నికల ప్రభావం కాంగ్రెస్, బిజేపి పై చూపించబోతుంది. తెలంగాణలో టీఆర్ఎస్, మహాకూటమి మద్య హోరా హోరి యుద్దం కొనసాగుతుంది.
9:00 am లైవ్ అప్డ డేట్స్ :
జలరాపాటన్ నియోజకవర్గం నుంచి రాజస్తాన్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ముందజలో ఉన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ టోంక్ నియోజకవర్గం నుంచి ముందజలో ఉన్నారు.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్తాన్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి నెలకొంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి , పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, కామారెడ్డిలో షబ్బీర్ అలీ, పరకాలలో చల్లా ధర్మారెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి దూసుకుపోతున్నారు.
కొండగల్లో రేవంత్రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్లో కూడా డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కారును వెంటాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కూడా హైస్పీడ్లో దూసుకుపోతుంది. ఇప్పటికి టీఆర్ఎస్ 70, కాంగ్రెస్ 26, బీజేపీ 1, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
నల్గొండ జిల్లాలో 9218 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. మక్తల్, సిరిసిల్ల, తుంగతుర్తి, సూర్యాపేట్, సిద్దిపేట, హుస్నాబాద్లో టీఆర్ఎస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యంలో ఉంది. వరంగల్ పశ్చిమలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 3022 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.
కాంగ్రెస్—టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ తప్పదని తేలిపోయింది. ఇప్పటి వరకు వెల్లడైన పోస్టల్ బ్యాలెట్లలో కారు, హస్తం ఒక్కో స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన పలువురు కౌంటింగ్ తొలి ట్రెండ్స్ ను బట్టి వెనుకంజలో ఉండగా, మరికొందరు లీడ్ లోకి వెళ్లిపోయారు. డీకే అరుణ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు వెనుకబడిపోయినట్టు తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నంలో మహాకూటమి మద్దతుతో పోటీపడిన మల్ రెడ్డి రంగారెడ్డి ముందంజలో ఉన్నారు.
పరకాల నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత కొండా సురేఖకు షాక్ తగిలింది. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సురేఖపై 6,000 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు.
వరంగల్ తూర్పు టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ మహాకూటమి అభ్యర్థిపై 1,100 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
చెన్నూరులో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ కు సానుకూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. చెన్నూరులో తొలి రౌండ్ ముగిసేటప్పటికీ మహాకూటమి అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ పై బాల్క సుమన్ 3,036 ఓట్ల మెజారిటీతో ముందుకు దూసుకుపోతున్నారు.
ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తమ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా వెనుకంజలో ఉన్నారు.
కొడంగల్ నుంచి ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబడిన రేవంత్ రెడ్డి తోలి రౌండ్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆయన సుమారు 600 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
కాంగ్రెస్ 75 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 65 సీట్లలో ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మొదటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ శ్రేణులు గెలుపుపై ధీమా ఉన్నారు.
జలరాపాటన్ నియోజకవర్గం నుంచి రాజస్తాన్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ముందజలో ఉన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ టోంక్ నియోజకవర్గం నుంచి ముందజలో ఉన్నారు.
11:00 am లైవ్ అప్ డేట్స్ :
వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఘనవిజయం సాధించారు. మరోవైపు శేరిలింగంపల్లిలో టీడీపీ నేత, మహాకూటమి అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ పై టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ 12,250 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తాజా అప్ డేట్ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 8,932 ఓట్ల లీడ్ తో విజయం దిశగా దూసుకుపోతున్నారు.
మాజీ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తన సమీప ప్రత్యర్థి పై 6,388 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. బాల్కొండలో టీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి, ఖైరాతాబాద్ లో దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 3,179 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
నకిరేకల్లో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్(వేముల వీరేశం) ఒక్క ఓటు ఆధిక్యంలో ఉంది.
నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కూకట్పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు.
2:00 pm లైవ్ అప్ డేట్స్ :
ఇక్కడ మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ పై 3,559 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
ఆదిలాబాద్ లో మాజీ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తన సమీప ప్రత్యర్థి పై 6,388 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. బాల్కొండలో టీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి, ఖైరాతాబాద్ లో దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 3,179 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
కారు వేగంగా దూసుకుపోతున్నా..కొన్నిచోట్ల దెబ్బతగులుతోంది. కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఓటమిపాలయ్యారు.
నోముల నర్సింహయ్య కాంగ్రెస్ అగ్రనేత జానారెడ్డిని ఓడించారు. రేవంత్ రెడ్డి, డీకే అరుణలాంటి నేతల ఓటమి కూడా దాదాపు ఖరారైపోయింది.
టీఆర్ఎస్ ఇప్పటికి 11 స్థానాల్లో గెలుపొందగా 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఒక స్థానంలో గెలుపొందింది. ఎమ్ఐఎమ్ రెండు చోట్ల గెలుపొందగా.. 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.
రాజస్తాన్లో 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తుంది.
తాండూర్ లో మంత్రి మహేందర్ రెడ్డి ఒటమి
ఓటమి దిశగా స్పీకర్ మధుసూదనచారి
నిజామాబాద్ లో రూరల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గెలుపు
ఇబ్రహీం పట్నంలో 11వ రౌండ్ లో కిషన్ రెడ్డి కి 2015 ఆదిక్యం
మహేశ్వరంలో 4393 ఆదిక్యంలో మహాకూటమి అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి
సనత్ నగర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపు..30,217 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్
5:00pm లైవ్ అప్ డేట్