నందమూరి సుహాసిని ఓటమి కూకట్ పల్లి లో నిజంగా షాక్ అని చెప్పాలి . మహాకూటమి తరపున కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. టీఆర్ ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఆమెకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు - హీరో బాలకృష్ణ ప్రచారం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సుహాసినికి ఓటమి తప్పలేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలివిగా వ్యవహరించింది జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు.


కూకట్ పల్లి లో సుహాసిని వెనుకంజ ... ఎవరు గెలవ బోతున్నారు ...!

ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని సుహాసిని చంద్రబాబు ప్రకటనతో రాత్రికి రాత్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏమాత్రం అనుభవం లేదనీ..ఆమె మీడియా ముందు సరిగా మాట్లాడలేకపోతోందని.. తెలుగు రాదేమో అంటూ.. సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సుహాసిని సోదరులైన జూ.ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లు ప్రచారం చేస్తారా? లేదా అనే దానిపై సందిగ్దం ఏర్పడింది. తన సోదరులిద్దరూ ప్రచారం చేస్తారని సుహాసిని భావించారు. అయితే ఆమె పోటీకి మద్దతిచ్చిన ఎన్టీఆర్ ప్రచారానికి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

పరువు కాపాడుకున్న జూనియర్ ఎన్టీఆర్!

సుహాసినికి మద్దతుగా ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.అయితే ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ తెలివిగా వ్యవహరించారంటున్నారు. హఠాత్తుగా తమ సోదరిని తెరమీదకు తీసుకురావడం వెనుక రాజకీయ ఎత్తుగడే ఉందనేది ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ గ్రహించారని అంటున్నారు. ఒకవేళ నందమూరి కుటుంబానికి న్యాయం చేయాలని భావిస్తే...తన తనయుడికి ఇచ్చినట్లే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి లేదా నామినేటెడ్ పదవి ఇవ్వచ్చనీ..కానీ అలా చేయకపోగా...నేరుగా బరిలో దింపడం వెనుక లెక్కలు వేరేనని రాజకీయ విశ్లేషకు పేర్కొన్నారు. ఇలా తమ అక్కను బలి పశువును చేసినందుకు ఎన్టీఆర్ చాలా భాదపడుతున్నాడని తన సన్నిహితులు చెబుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: