తెలంగాణా ఎన్నికల పుణ్యమాని తెలుగు రాష్ట్రాల రాజకీయం రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టేలను మారుస్తూ చంద్రబాబు ప్రయోగాలు చేస్తూంటే ఏపీలోని విపక్ష పార్టీలకు కూడా కొత్త సమీకరణలు బలం కానున్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడన్న నీతి ఏపీలో రేపటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించనుంది.
వైసీపీకి నైతిక బలం :
వైసీపీని ఏర్పాటు చేసిన తరువాత ఒంటరి పోరునే నమ్ముకున్న జగన్ కి తెలగాణాలో ముందస్తు ఎన్నికలు జరగడం, కేసీయార్ మళ్ళీ అధికారంలోకి రావడం శుభ పరిణామంగానే చెప్పాలి బాబు పొడ గిట్టని కేసీయార్ ఇక ఏపీలో జగన్ కి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. కేసీయార్ ఓటమి కోసం బాబు క్రిషి చేసి ఫెయిల్ అయ్యారు. మరి ఇక్కడ బాగు ఓటమి కొసం కేసీయార్ కచ్చితంగా పోరాడుతారని అంటున్నారు.
ఆయన ఏపీలో తన రాజకీయ అస్త్రాలు అన్ని సంధించి మరీ బాబుని దెబ్బ తీస్తారని ఆ, విధంగా జగన్ కి అది హెల్ప్ అవుతుందని అంటున్నారు. జగన్ కి సైతం ఇతర రాజకీయ పార్టీల మద్దతు నిన్నటి వరకూ లేదు. ఇపుడు రాజకీయ చాణక్యుడు, బాబుకు ఏ మాత్రం తీసిపోని కేసీయార్ అండదండలు దొరకడం ద్వారా రేపటి ఎన్నికల్లో విజయాన్ని సులభం చేస్తాయని అంటున్నారు.
ఆ పార్టీ మద్దతు
:
ఇక కేసీయార్ ఒక్కరే కాదు. ముస్లిం సమాజంలో మంచి బలం, పలుకుబడి కలిగిన మజ్లిస్ పార్టీ కూడా జగన్ కి మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ అధినాయకుడు అసదుద్దీన్ ఒవైసీ జగన్ పై హత్య యత్నం జరిగిన సమయంలో ఇటికి వెళ్ళి మరీ పరామర్శ చేశారు. అంతే కాదు, ఏపీలో వచ్చేది జగన్ పార్టీయేనని ఇప్పటికి పలు మార్లు చెప్పారు. మరి ఏపీలో వైసీపీకి ముస్లిం మైనారిటీల మద్దతు ఉంది. అసదుద్దీన్ సపోర్ట్ కనుక ఉంటే ఆ వర్గం గుత్తమొత్తంగా ఓటు చేసే అవకాశం ఉంది.
అలాగే కేసీయార్ సామాజిక వర్గం కూడా ఏపీలో ఇపుడు వైసీపీ వైపు తిరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎలా చూసుకున్నా కేసీయార్ విజయం జగన్ కి అవసరమైన వేళ ఓ టానిక్ లా పనికొస్తోందని అంటున్నారు. జగన్ కి జనంలో గ్లామరు ఉంది. కానీ సరైన వ్యూహాలు లేక ఆ పార్టీ 2014 ఎన్నికల్లో చతికిలపడింది. ఇపుడు కేసీయార్ వంటి రాజకీయ చతురుడు మద్దతు కనుక ఇస్తే వ్యూహాలు సైతం ఫలిస్తాయని, విజయం తధ్యమని కూడా వైసీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. ఈ కారణంగానే టీయారెస్ గెలుపుని వైసీపీ శ్రేణులు ఏపీలో సంబరాలు చేసుకున్నాయని అంటున్నారు.