వినటానికి విచిత్రంగా ఉన్న ఇది నిజమే. సినీప్రముఖుడు, జగన్మోహన్
రెడ్డి మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, నందమూరి
బాలకృష్ణ, చుండ్రు అలియాస్ నందమూరి సుహాసినిపై విరుచుకుపడ్డారు. కుకట్ పల్లి
నియోజకవర్గంలో సీమాంధ్రులు, కమ్మోరు కలిసి సుహాసినిని ఓడగొట్టినందుకు అందరికీ
థ్యాక్స్ చెప్పుకున్నారు. అభ్యర్ధులకు ఓట్లేసేటపుడు కేవలం కమ్మోరా ? కాదా ? అని
మాత్రమే చూడకుండా అభ్యర్ధి మనకు మంచి చేస్తారా ? లేదా ? అని మాత్రమే చూసి టిఆర్ఎస్
అభ్యర్ధి మాదవరం కృష్ణారావుకు ఓట్లేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కుకట్ పల్లి నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని సుహాసినిని కేవలం కమ్మోరు ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న ఏకైక కారణంతోనే చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయించారని పోసాని అభిప్రాయపడ్డారు. ఏపిలో కమ్మోరికి మనం మనం ఒకటి అనే కమ్మ దురదను చంద్రబాబు అండ్ కో బాగా అంటించినట్లు మండిపడ్డారు. ఆ దురద ఉన్నంత కాలం కమ్మ కులం బాగుపడదని మండిపడ్డారు. పోనీ కమ్మకులం వారు మాత్రమే ఓట్లేసినంత మాత్రానా చంద్రబాబు అధికారంలోకి వస్తారా ? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఒకరికి ఓట్లేసేటపుడు సమాజానికి మంచి చెయ్యగలరా లేదా అన్నది మాత్రమే చూడాలన్నారు. అంతే కానీ కేవలం కులం కార్డు ఉపయోగించినంత మాత్రాన ఓట్లేస్తే నష్టం జరుగుతుందన్నారు.
కుకట్ పల్లి ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా ఏమాత్రం ఓనమాలు తెలియని సుహాసినిని కేవలం తన అవసరాల కోసం మాత్రమే చంద్రబాబు ఎన్నికల్లోకి దింపినట్లు పోసాని చెప్పటంలో తప్పేమీ లేదు. నాలుగున్నరేళ్ళల్లో సీమాంధ్రుల విషయంలో కానీ లేదా ఏ ఒక్క సామాజికవర్గం విషయంలో కానీ వివక్ష చూపని కెసియార్ కు అనుకూలంగా ఓట్లేయాలని సీమాంధ్రులు అనుకోవటంలో తప్పేమీ లేదన్నారు. పనిలో పనిగా బాలకృష్ణను కూడా ఎద్దేవా చేశారు.
ఏపిలోకి అడుగుపెడితే కెటియార్ తాట తీస్తానన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో పోసాని స్పందించారు. తండ్రి ఎన్టీయార్ ను పదవిలోని దింపేసి చంపేసిన వాళ్ళ తాటి తీశాడా ? వైశ్రాయ్ హోటల్ ముందు ఎన్టీయార్ పై చెప్పులేసిన వాళ్ళ తాట తీశాడా ? అంటూ ఎదురు ప్రశ్నించారు. పై సంఘటనల సందర్భంగా బాలకృష్ణ ఎవరి తాటనైనా తీసుంటే రేపు కెటియార్ తాటకూడా తీస్తాడని అనుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. ఇంత చెప్పిన పోసాని చివరగా ఏపిలో కమ్మోరు రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లేయద్దని అప్పీల్ చేయటం గమనార్హం. చంద్రబాబుకు ఓట్లేసే విషయంతో తెలంగాణా ప్రజలు చూపిన విజ్ఞతనే ఏపి ఎన్నికల్లో ఓటర్లు ప్రధానంగా కమ్మోరు కూడా చూపాలంటూ పిలుపివ్వటం గమనార్హం.