తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ ఇక్కడ అభివృద్ది కాంక్షిస్తున్నారు..ఇందుకు నిదర్శనమే నిన్నటి టీఆర్ఎస్ అఖండ విజయం..మేం గెలవలేదు ప్రజలే గెలిచారు...ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..తెలంగాణ ప్రజలు ఆయన్ని కేసీఆర్ అంటారు. ఇక తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన తర్వాత 105 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు కేసీఆర్. ఆ సమయంలో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి..ఎంత ధీమా ఉంటే మాత్రం ఇలా అనౌన్స్ మెంట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని మట్టి కరిపించాలని కంకణం కట్టుకున్న టి కాంగ్రెస్ ఒక్కరితో సాద్యం కాదని..టిటిడిపి, టిజెఎస్, సిపిఐ లతో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడింది.
మహాకూటమి కోసం ఏకంగా కేంద్రం నుంచి జాతీయ నాయకులు సోనియా గాంధీ, రాహూల్ గాంధీ, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరంతా ముమ్మర ప్రచారం కొనసాగించారు. చివరంగా మరో అస్త్రాన్ని ప్రయోగించారు..ఆయనే లగడపాటి రాజగోపాల్. రిజల్ట్ వచ్చే రెండు రోజు ల ముందు తెలంగాణలో హంగ్ వస్తుందని..లేదా కూటమి పాలనలోకి వస్తుందని..తెలంగాణ చిత్తుగా ఓడిపోయి కనీసం 35 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కానీ నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి..మహాకూటమి కళ్లు బైర్లు కమ్మిపోయేలా ఒక్కో ఫలితం చూస్తుంటే ప్రత్యర్థులు షాక్ కి గురయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు చిత్తు చిత్తుగా ఓడిపోయారు.
తెలంగాణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీపడిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరు మినహా.. అందరూ చిత్తుగా ఓడిపోయారు. అధికార పార్టీ టీఆర్ఎస్ 88 స్థానాలని దక్కించుకుని ఆధిపత్యం చెలాయించగా.. కాంగ్రెస్, టీడీపీల మహాకూటమి 21 స్థానాలకే పరిమితమైంది. ఇక మజ్లిస్ ఏడు, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందగా.. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామగుండంలో తెరాస తిరుగుబాటు అభ్యర్థి కోరుకంటి చందర్ అనూహ్య విజయాన్ని అందుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ సోమారపు సత్యనారాయణకి టికెట్ ఇవ్వడంతో చందర్ రెబల్ అభ్యర్థిగా మారాడు. అతడ్ని బుజ్జగించేందుకు పార్టీ ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ఉద్యమకారుడు రాజకీయ నాయకుడు. మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాధన పాదయాత్ర పేరుతొ 48 కి. మీ . పాదయాత్ర చేశారు. ఇతను ఉద్యమంలో భాగంగా 45 రోజులు జైలు జీవితం గడిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ మళ్లీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోగా, మరొకటి రెబెల్ అభ్యర్థి ఖాతాలో పడింది. తాజా మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పుట్ట మధు, బొడిగె శోభ, సోమారపు సత్యనారాయణ పరాజయం పాలయ్యారు.
ఈసారి హుజూరాబాద్లో ఈటల రాజేందర్, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, సిరిసిల్లలో కేటీఆర్ గెలుపొందారు. మంథని నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్బాబు గెలిచారు. అయితే రామగుండం నుంచి టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి కోరుకంటి చందర్ నిన్న రాత్రి కార్యకర్తలతో సమావేశం కాగా..టీఆర్ఎస్ లోకి వెళ్తే అభివృద్దికి సుగమం అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లుగా సమాచారం.