తెలంగాణ లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడటం తో పాటు నందమూరి ఆడపడుచుని కూడా ఎన్నికల్లో దింపి చంద్ర బాబు ఆ కుటుంబ పరువు తీశాడు . అయితే ఇవన్నీ అర్ధం చేసుకోలేని సమర్థత లేని వాడు కాదు తారక్ . నందమూరి ఫ్యామిలీ లో చంద్ర బాబు ను ఢీ కొట్ట గల సామర్ధ్యం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కే ఉన్నాయి. అయితే  ఇలా సుహాసినిని ఎన్నికల్లో నిలబెట్టి, తానేదో నందమూరి కుటుంబాన్ని ఆదుకున్నానన్నట్టు కలరింగ్ ఇచ్చారు బాబు... ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారానికి రాలేదంటూ వాళ్లను బద్నామ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి రాజకీయాలు బాబుకు కొత్తకాదు. గతంలో హరికృష్ణ విషయంలో కూడా ఇలానే చేశారు. పొమ్మనలేక పొగబెట్టారు. హరికృష్ణను పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరం చేశారు.

Image result for jr ntr tdp

ఇక బాలయ్య సంగతి సరేసరి. బాబు ఏది చెబితే దానికి "బుల్ బుల్" అనడం మినహా బాలయ్య ఏమీ చేయలేడు. ఇలా నందమూరి కుటుంబంలో అందర్నీ డమ్మీల్ని చేశారు చంద్రబాబు. ఇలా అందర్నీ సైడ్ ట్రాక్ లో పెట్టి తనయుడు లోకేష్ ను టీడీపీలో మెయిన్ పిల్లర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి ఉన్న ఒకే ఒక్క ఆశాదీపం ఎన్టీఆర్. తారక్ మరోసారి తెరపైకి రావడానికి ఇదే మంచి సమయం. తెలుగుదేశం పార్టీలో అధికార మార్పిడి ప్రారంభం కాకముందే ఎన్టీఆర్ మేల్కోవాలి. బాబు చేతుల్లోంచి అధికారం లోకేష్ కు బదిలీ కాకముందే రంగంలోకి దిగాలి.

Image result for ntr

ప్రస్తుతం నందమూరి కుటుంబంలో చంద్రబాబును ఎదిరించేంత స్టామినా కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది. పార్టీలో నందమూరి హవాను మళ్లీ తీసుకురావాలన్నా, కుటుంబం మళ్లీ పార్టీకి పెద్దదిక్కుగా మారాలనే హరికృష్ణ చిరకాల కోరిక నెరవేరాలన్నా అది ఇప్పుడు ఎన్టీఆర్ చేతుల్లో మాత్రమే ఉంది. పూర్తిగా బాబు ఆధీనంలోకి వెళ్లిపోయిన బాలయ్య వల్ల ఆ కుటుంబానికి ఇప్పుడేం ఒరగదు. నందమూరి కుటుంబానికి ఓ విలువ రావాలన్నా, గౌరవం పెరగాలన్నా అది ఒక్క ఎన్టీఆర్ తో మాత్రమే సాధ్యం. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న ఎన్టీఆర్ ఈ దిశగా ఆలోచిస్తున్నాడా లేదా?

మరింత సమాచారం తెలుసుకోండి: