తెలంగాణలో ఎన్నికలు పూర్తి అయ్యాయి..నిన్న వచ్చిన ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొదటి నుంచి తాము చేసిన అభివృద్దిపై ప్రజలకు నమ్మకం కలిగిందని..అందుకే టీఆర్ఎస్ ని మరోసారి ఆశీర్వదించారని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఉదమ్య నాయకుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభపక్షనేతగా కేసీఆర్ ఎన్నికయ్యారు. బుధవారం నాడు జరిగిన టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో కేసీఆర్ను టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో88 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది ఎమ్మెల్యేలు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామగుండంలో విజయం సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థి కోరుకంటి చందర్ కూడ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు.దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 89కు చేరుకొంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కేసీఆర్ స్వయంగా అభినందించారు. దేశ రాజకీయాలతో పాటు, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ చర్చించారు..ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. ఏకగ్రీవ తీర్మాన ప్రతిని కొద్ది సేపట్లో నరసింహన్ కు కేసీఆర్ అందజేయనున్నారు.
రాజ్ భవన్ కు కేసీఆర్ తో ఇతర నేతలు కూడా వెళ్లనున్నారు. కాగా, రేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్, మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశం ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రొటెం స్పీకర్ గా రెడ్యా నాయక్ ను నియమించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.