అవును. తాజాగా ఈ అంశంపైనే ఏపీలో టీడీపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి తాజా గా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కూకట్పల్లి నియజకవర్గం నుంచి పోటీ చేసిన హరికృష్ణ కుమార్తె సుహాసిని ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. నిజానికి సెంటిమెంట్ కానీ, అభివృద్ది మంత్రంకానీ, మహిళ అనే సానుభూతి కానీ ఏవీ కూడా అక్కడ పనిచేయలేదు. దీంతో సుహాసిని ఓటమిపాలయ్యారు. అంటే.. నిజానికి మరోరూపంలో చూసుకుంటే.. హరికృష్ణ కుటుంబానికి ఏదైనా చేయాలి! అనుకున్న చంద్రబాబు సానుభూతి కూడా విఫలమైంది. అయితే, ఇప్పటికీ మించిపోయిన పరిస్థితి లేదని అంటున్నారు సీనియర్లు.
మరో నాలుగు మాసాల్లోనే ఏపీలో ఎన్నికలు ఉన్నాయని, ఏపీలో నందమూరి ఫ్యామిలీకి సానుభూతి ఉందని అంటు న్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక, హరికృష్ణ కుమార్తెగా సుహాసినిని కూడా ఆదరించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా నందమూరి కుటుంబానికి కృష్ణా జిల్లాలో మంచి స్థానం ఉంది. ఇక్కడే అన్నగారు కూడా జన్మించారు. ఈ నేపథ్యంలో హరికృష్ణకు మంచి కేడర్ కూడా ఉంది. దీంతో ఆయనలేని సెంటిమెంటు ఇక్కడ పనిచేసే అవకాశం టీడీపీకి, నందమూరి ఫ్యామిలీకి ఉంటుందని కూడా సీనియర్లు చెబుతున్నారు.
ఇక, సుహాసినిని పోటీ కి నిలబెట్టే పరిస్థితి కనుక ఉంటే.. ఖచ్చితంగా గెలుపు గుర్రంఎక్కించుకునే స్థానంకూడా అని సీనియ ర్లు సూచిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం అయితే, సుహాసిని గెలుపు గుర్రం ఎక్కడం ఖాయంగా కనిపి స్తోందని అంటున్నారు. నిజానికి ఈ నియోజకవర్గంలో కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన మూడు ఎన్నికల నుంచి కూడా ఆయనే గెలుస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనకు ఇక్కడ ఎదురు లేదు. టీడీపీ నాయకులు కూడా చెట్టుకొకరు.. పుట్టకొకరు.. అన్న చందంగానే ఉన్నారు.
దీంతో ఇక్కడ గెలిచి నానికిషాక్ ఇవ్వాలని చూస్తున్న చంద్రబాబుకు ఆయన ప్రయత్నాలు ఏవీఫలించడం లేదు. దీంత ఇక్కడ నుంచి సుహాసినిని రంగంలోకి దింపితే.. ఫలితం ఉంటుందని అంటున్నారు పరిశీలకుల. పైగా.. నందమూరి ఫ్యామిలీకి కొడాలి నాని అత్యంత ఆప్తుడు. సో.. ఇక్కడ నుంచి సుహాసిని రంగంలోకి దిగితే. బహుశ ఆయన ఏకంగా పోటీ నుంచి కూడా తప్పుకొని పరోక్షంగా సుహాసిని గెలుపునకు కృషి చేసే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. మరి బాబు ఈ దిశగా ఆలోచన చేస్తారో లేదో చూడాలి.