"నేను...నా వల్లే...ఈ ఐటి ఉద్భవించింది...అందరికీ ఐటి నేర్పిందీ... నేనే...సత్య నాదేళ్ళని ఐటి చదవమని చెప్పిందీ నేనే...అల్గ్జాండర్ ని భారత రాష్ట్రపతిని చేసిందీ నేనే... వాజ్ పాయిని, దేవే గౌడని, ఐకే గుజ్రాల్ ని, చివరకు నరేంద్ర మోడీని ప్రధానిని చేసిందీ నేనే...పెద్ద నోటల రద్ధు, జిఎస్టీ అమలు ఇవన్నీ నా ప్రోద్భలం ప్రోత్సాహం తో మాత్రమే భారత్ లో అమలయ్యాయి" ఇలా ఎన్నో మహాద్భుత ఆవిష్కరణలు ఘన కార్యాల నిర్వహణా చేసిందీ నేనే అన్న మహనీయుడు ఎవరో ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పేరు చెప్పకపోయినా తెలుసు.
ముఖ్యంగా తెలంగాణా ప్రజలకోసం హైదరబాద్ ను ప్రపంచపటంలో పెట్టటం - ఆపై సైబరాబాద్ నిర్మించి యివ్వటం, అంతా నా శక్తియుక్తులతోనే అనటంతో, ఈ వెరైటీ చంద్రపిచ్చి పరాకాష్ఠ కు చేరిందని గమనించిన తెలంగాణా వాళ్ళు ఎన్నికల్లో వాటికి రిటన్ గిఫ్ట్ గా ఎడంకాలుతో ఎగిరెగిరి తంతే ఆ టిడిపితో పాటు వారి మిత్ర పక్షం కాంగ్రెస్ తో కూడిన ప్రజాకూటమి నేడు కుంగి కుళ్ళి కునారిల్లుతుంది.....
ఈ సందర్భంగా ఆ మహనీయ ఆవిష్కరణ సామ్రాట్ నిన్నొక మరో కామెడీ చేశారు.... దానికి జనం నోటితో కాకుండా ఇంకోదానితో నవ్వుకున్నారు. ఆ కథేమంటే:
"నా వల్లే ఆ మూడు రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడింది. ఆ మూడు చోట్ల కాంగ్రెస్ విజయం వెనుక తెలుగు దేశం పార్టీ కృషి ఎంతో ఉంది.." అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ సార్వం సహాసార్వ భౌముడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీజేపీని ఇంటికి పంపేవరకూ నిద్రపోనని చెప్పారు. నిన్న గురువారం విశాఖ పర్యటనలో భాగంగా 'కాపులుప్పాడ' వద్ద ఏర్పాటు చేయనున్న 'ఐ–హబ్' తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
సాయంత్రం తగరపువలస జూట్-మిల్ గ్రౌండ్స్లో జరిగిన సభలో చంద్రబబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. వ్యవస్థలనన్నింటినీ భ్రష్టుపట్టించారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ కబంద హస్తాల నుంచి దేశాన్ని కాపాడాలన్న సంకల్పం తోనే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
తెలంగాణ ఎన్నికల్లో నావల్లే ఏదో జరిగిపోయిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. అక్కడ పార్టీ కోసం 35 ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.
"టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కూడా టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా నరేంద్ర
మోదీపై పోరాడుతున్నారు. ఇద్దరూ కలిసి ముందుకెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. తన
పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్ తో కూడా వెళ్లడానికి
వీల్లేదని అడ్డు జెప్పారు. నేను అక్కడ పని
చేయడం తప్పయినట్టు, నాకేదో 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తానంటున్నాడు. ఇది న్యాయమా?" అని
ప్రశ్నించారు. తానెవరికీ భయపడనన్నారు. ఫ్యాక్ట్
ఫైండింగ్ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం
₹75000 కోట్లివ్వాలని తేల్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆ విషయమై ఒక్క
మాట కూడా మాట్లాడడం లేదని
విమర్శించారు.
The last Nizam of Hyderabad state, greets Sardar Patel at Begumpet Airport after the success of Operation Polo -
Main street of Hyderabad with Charminar, 1890
నరేంద్ర మోదీ కంటే తనకు ఎంతో అనుభవముందని, కానీ ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు "సార్!.. సార్!" అంటూ ఎలా బతిమిలాడానో అందరూ చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయినా రాజధానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ (ఏఎంటీజెడ్) ఏర్పాటుతో విశాఖపట్నానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని పెదగంట్యాడ వద్ద ఏర్పాటైన 'ఏపీ మెడ్టెక్ జోన్' ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన 'నాలుగో గ్లోబల్ ఫోరం సదస్సు' లో ఆయన మాట్లాడారు. వైద్య పరికరాల తయారీ లో అగ్రదేశాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందన్నారు. దేశం లోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తాయన్నారు.