ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు ఉదయ్కుమార్ అనారోగ్యంతో కన్నుమూసారు. హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయ్కుమార్ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఉదయమే గుండెపోటు రావడంతో ఆయన్ను హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.
ఉదయ్ కుమార్ చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు. ఉదయ్ మృతదేహాన్ని సందర్శించేందుకు సీఎం చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. ఉదయ్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం షిరిడీ యాత్రలో ఉన్నారని తెలుస్తోంది. వారు వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు.
అలాగే ఉదయ్ కుమార్ అంత్యక్రియలు హైదరాబాద్లో నిర్వహిస్తారా.. లేదా స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహిస్తారా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.